Saturday 28 October 2017

నా తొలి పుస్తకం "శ్రీ రాఘవం!శ్రీ మాధవం!" పుస్తకం అమ్మకానికి సిద్ధం - ఇది నా రెండో అడుగు!

          ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక వ్యాఖ్యాత మిత్రులు నా మెదడులో ఒక విత్తనం నాటారు,"మీ భావాలు బాగున్నాయి,ఇలాంటి విషయాలు ఎక్కువమందికి తెలియాల్స్దిన అబసరం ఉంది - ప్రింటు రూపంలో తీసుకొస్తే బాగుంటుంది" అని.మొదట "ప్రపంచమొక నిరంతర భోగయాత్ర!" అని పేరు పెట్టి "అవే దృశ్యాలు..." అనే పోష్టుతో ఆగేటట్టు కొన్ని పోష్టుల్ని కలిపి కినిగె దగ్గిర ప్రయత్నించాను.కానీ అది కార్యరూపం దాల్చలేదు.తర్వాత మెల్లగా బ్లాగుల్లోకి వచ్చినప్పుడు శ్రీకారంతో మొదలుపెట్టాను,ఇక్కడ కూడా ఆదే చేద్దాం అనే కొత్త ఆలోచన పుట్టి పెరిగి పెద్దదై ఈ ప్రయత్నం మొదలుపెట్టాను.ఇక్కడా ఆదివిఘ్నం జరిగి నిరాశలో ఉంటే మిత్రులు JV publikaeshans గురించి ప్రస్తావించారు.అలా ఇప్పటికి ఒక రూపం తయారై వచ్చింది.
          మొదటి రోజుల్లో చాలా హుషారుగా అనిపించింది గానీ జ్యోతిగారు చెప్పిన వాస్తవాలు విన్నాక పుస్తక ప్రచురణ అంత లాభసాటి కాదని తెలిసింది.జనంలో చదివే అలవాటు పోయింది.అసలు ఈ తరానికి దేనిమీదా ఆసక్తి లేదు,ఎందుకో మరి!సరే,దిగాక ముందే నీరసపడటం దేనికి?నా పోష్టుల్లో ఉండే చదివించే లక్షణం మీద నమ్మకంతో బయలుదేరాను, ఒకవేళ పరిస్థితి నీరసంగా ఉంటే "మహామహుల పుస్తకాలే అమ్ముడుపోవటం లేదు, మనదేముంది?" అని అప్పుడే సరిపెట్టుకోవచ్చు:-)

          నా పోష్టుల్లో నేను ఎన్నుకుని ఇందులో ఉంచినవి 12 పోష్టులు.మొదటి అయిదూ రామాయణం గురించిన విమర్శలకి ప్రతి విమర్శలూ విశ్లేషణలూ.తర్వాత రెండూ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందువులు చేసిన, చేస్తున్న పోరాటం యొక్క చరిత్ర.తర్వాత నా కవితల్లోకల్లా మంచిదైన "నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం" అనే ఎవరికి వారు పాడుకోవటానికి అనువైన కీర్తన. దాని తర్వాత విశిష్టమైనది 11వ వ్యాసం "విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!" అనేది. ఇందులో హిందూధర్మానికి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలని సింపుల్ లాంగ్వేజిలో చెప్పాను.

1. హిందూ ధర్మ ప్రహేళికలు - చారిత్రక విషాదం!
2. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా వైభవం!
3. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విశ్లేషణం!
4. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విమర్శనం!
5. హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విజృంభణం!
6. సచ్చా ముసల్మాన్లు అయోధ్యలో రామాలయం కట్టడాన్ని వ్యతిరేకించరు - శ్రీరామ జయం!
7. సీతమ్మ వారి పుట్టింట్లో యెంత వైభోగం?రాముల వారి నట్టింట్లో యెంత నైరాశ్యం!
8. నీ ప్రేమ నాకు భవరాగ బంధమోక్షణం!శ్రీ రుక్మిణీనాధ, నీ ప్రేమ నాకు దివ్యౌషధం!
9. బ్రహ్మకి ఆలయపూజావిధానం ఎందుకు లేదు?శివుణ్ణి లింగరూపంలోనే ఎందుకు పూజించాలి!
10. హర హర గంగే!హరిత సస్య తరంగ నూపుర మంగే!
11, విశ్వసృష్టిరహస్యం మేడీజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!
12. శ్రీరాఘవం! దశరధాత్మజం! అప్రమేయం!

          చదివిన వారికి రుచి తెలిసి వూపు వస్తే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది.తను అధికారంలోకి వస్తే రామాలయ్ నిర్మాణం చేస్తానని ఒకనాడు 2 సీట్లకే పరిమితమై హిందూ మతతత్వ పార్టీ అని అవమానించబడుతున్న స్థాయి నుంచి ఈనాటి స్థాయి వరకూ ఎదిగిన బీజేపీ తన ఉత్ధానానికి కారణమైన రాముణి మర్చిపోయి తన పార్టీకి చెందిన సన్యాసి ముఖ్యమంత్రి కూడా నిన్నటి కేరళ ఎన్నికల్లో బఫూనులా తయారై రేపటి ఎన్నికల్లో తను ప్రచారం చేసినా గెలుపు కష్టమై దిక్కులు చూడాల్సిన స్థితిలో నిలబడిన సమయంలో కూడా దానికి కారణం ఏమిటో తెలుసుకోలేని అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నది - అయోధ్యలో రామాలయం కడితే చూడాలని తపిస్తున్న రామభక్తుల్ని మోసం చేస్తున్నది,అయినా హిందువుల్లో బెజేపీ పట్ల కోపం రాకపోవడానికి ఆ లక్ష్యం కోసం జరిగిన ప్రయత్నాలకి సంబంధించిన చరిత్ర తెలియకపోవడమే కారణం అని నా నమ్మకం!

          168 పేజీల పుస్తకం ధర Rs.150/-గా నిర్ణయించటం జరిగుంది.ప్రతులకు జ్యోతి వలబోజు గారిని సంప్రదించవలసిన చిరునామా:<jyothivalaboju@gmail.com>నేను కడుపులో చల్ల కదలకుండా కూర్చుని రాసిన పోష్టులు కాబట్టి రాసేటప్పుడు నేను కులాసాగానే రాశాను గానీ ధూర్జటి ఫాంట్ వాడి పుస్తకానికి ఇంత చక్కని రూపం తీసుకొచ్చిన జ్యోతి వలబోజు గారి కష్టమే ఎక్కువ.పుస్తకం మంచి ఫలితాన్ని ఇస్తే నాకన్నా ఎక్కువ కష్టపడిన ఆమెకే క్రెడిట్ ఇవ్వాలి!

జై శ్రీ రాం!

Thursday 26 October 2017

ఎవరు మీటుతున్నారో ఆశల నిరాశల నిక్వణాలను?ఎవరు చల్లుతున్నారో నీరసపు చలిగాడ్పుల నిట్టూర్పులను!

క్షణమో?యుగమో?
మోహమో?దాహమో?
జననమో?మరణమో?

ఈ అనంతకోటి విశ్వాలలో,
ఈ ప్రాచీ ప్రతీచీ విభావరి సంధ్యలలో,
ఈ స్వప్నరాగ వీణికాతంత్రులపై

ఎవరు మీటుతున్నారో
ల నిరాశ నిక్వణాలను?

దుఃఖమో?యోగమో?
ద్రోహమో?మోసమో?
నీరవమో?శోధనమో?

ఆ చైత్ర మాసారంభ వేళలలో,
ఆ వసంతకాలపు సరాగ సంరంభాలలో,
ఆ త్రుళ్ళింతల పరవశావేశాలపై

ఎవరు చల్లుతున్నారో
నీరసపు చలిగాడ్పుల నిట్టూర్పులను!

Sunday 15 October 2017

ఏ బ్లాగరుల్ మము తూలనాడంగ నేమి పనియో!తమరు మారుమనస్సు పొందిన పరిశుద్ధాత్ములో?ఇంతకు నేను తమకు చేసిన చైదమేమి?

          నాకు ప్రతి పోష్టునీ ఎత్తుగడ,విషయం,సంహార్మ్ అన్నీ మంచి బిగింపుతో రాయలనే ముచ్చట ఎక్కువ!అన్ని పోష్టులూ ఒకేలా రాయాలంటే బోరు కొడుతుంది.కానీ ఈసారి సూటిగ విషయంలోకి వస్తున్నాను.Thursday, 12 October 2017న Srinivas rjyగారు "అనామకుల కామెంట్లలో తిట్లకు బాధ్యులు ఎవరు?" అనే పోష్టు వేశారు.అదే రోజు నా బ్లాగులో నన్ను నిలదీస్తూ ఓక కామెంటు అవెశారు.నిలదీసిన విషయం ఏమిటో వారి కామెంటులోనే ఉంది,చదవండి:

హరిబాబు గారూ ! ఇంతకుముందు ఎప్పుడూ మీ బ్లాగులో నేను కామెంట్ పెట్టినట్లు గుర్తులేదు .. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే - పైన ఇద్దరు Anonymous గొడవల్లో నా ప్రస్తావన వచ్చింది .. అది ఎలా వస్తున్నదో నాకు అర్ధం కావట్లేదు . ఒక బ్లాగు ఓనర్ అయి ఉండి అటువంటి కామెంట్లను ఎలా ఎంకరేజ్ చేసి ప్రచురిస్తున్నారు ? 
మీ సమాధానం కోసం ఎదురు చూస్త్తూ

శ్రీనివాస్ 
శోధిని

దానికి నా జవాబు ఇది:
I don't know particularly It is about you!My criteria are - foul language and personal attack.I will check and remove those comments causing irritation to you.

ఆయన పేరును ప్రస్తావిస్తున కామెంటును తీసేసి మళ్ళీ ఆయనకి జవాబు చెప్పిన కామెంటు ఇది:
I have removed the comments mentioning you!

          నేను మొదటినుంచీ కామెంట్లని పబ్లిష్ చెయయ్డానికి ఒక పధతి పెట్టుకునాను.నిజానికి బ్లాగులో మనం ఒక పోష్టు రాశామంటే కామెంట్లని ఆ పోష్టుకి సంబంధించిన విషయానికి ప్రతిపందనలుగానే చూడాలి.విషయానికి సమబంధం లేని కామెంట్లని పబ్లిష్ చెయ్యడం అనవసరమే!కానీ నేను రాస్తున్నవి వర్తమాన సమాజానికి  సంబంధించినవి కాబట్టి మన చుట్టూ జరుగుతున్న విషయాలకి సంబంధించిన కామెంట్లని కూడా పబ్లిష్ చేస్తున్నాను.ఉదాహరణకి పెద్దనోట్ల రదు గురించి నేను పోష్టు వెయ్యలేదు.కానీ అది ముఖ్యమైన విషయం కాబట్టి పోష్టులకి సంబ్నధం లేకపోయినా ఇక్కడ అందరూ ఎన్నో మంచి కామెంట్లు వేశారు.నాకు పెద్దనోట్ల రద్దు పట్ల గట్టి వ్యతిరేకత లేకపోయినా దాన్ని గటిగా వ్యతిరేకిస్తున్న వాళ్ళ కామెంట్లు కూడా వేశాను.ఇప్పుడు శ్రీనివాస్ గారు నా అని కామెంట్లనీ ఉంచలేదు,కొనింటినే ఎందుకు ఉంచారు అని అడుగుతున్నట్టు అడిగే అధికారం ఎవ్వరికీ లేదు.ఏ కామెంటు ఉంచాలి,ఏ కామెంటు తీసెయ్యాలి అనేది నా విచక్షణ ప్రకారం చేస్తున్న పనులు - అందులో నన్ను నిలదీస్తే నేను పట్టించుకోను.

కామెంట్లకి సంబంధించి నేను పెట్టుకున్న క్రైటేరియా ఇది:తమకి ఎంతో ఇష్టమైన విషయం గురించి వాదించేటప్పుడు ఉద్రేకాలు సహజం కాబట్టి మరీ నీచమైన భాష వాడకుండా జాగ్రత్త పడితే చాలునని చెప్పాను.నేను వేస్తున్న పోష్టులు హిందూమతం మీద జరుగుతున్న దాడికి ఒక హిందువు నుంచి వస్తున్న ప్రతిదాడి కాబట్టి నా పోష్టులో నేను వాడే భాష కూడా తీవ్రంగానే ఉంటుంది!

          మోడరేషన్ పెట్టని రోజుల్లో అయితే అస్మదీయులకే కాదు తస్మదెయులకి కూడా వలపక్షం లేకుండా నేను చెప్పింది ఒకటే అవతలివాళ్ళు అసభ్యమైన భాష వాడితే తొందరపడి స్పందించకుండా ఆ కామెంటును ప్రస్తావించి తీసెయ్యమని నాకు హింట్ ఇవ్వండి, తస్మదీయులు అస్మదీయుల కామెంట్లని తీసెయ్యమన్నా సరే రిక్వెస్ట్ వస్తే తియ్యకుండా ఉండలేను అని హామీ ఇచ్చాను.అయినా సరేఅ,కొందరు తస్మదీయులు వాళ్ళంతట వాళ్లే బూతులు వాడారు,తిన్నారు - ఆఖరున నన్ను బ్లేం చేశారు.

          అప్పుడు నేను చెప్పిన జవాబు కూడా నిర్మొహమాటంగానె ఉంది.హిందూమతాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ళుగా వాళ్ళు నాకు శత్రుస్థానంలో ఉన్నారు.నేను పదే పదే చెప్తున్నా వినకుండా తమ దురద కొద్దీ రెచ్చిపోయి బూతులు తిట్టించుకుంటే వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నాకు దేనికి ఉంటుంది?నువ్వు నిలువెల్లా ద్వేషంతో నిండిపోయి హిందూమతం మీద విషం కక్కుతుంటే నీ ఆత్మగౌరవాన్ని నేను కాపాడాలని ఆశించటం నీ తెలివితక్కువతనం!

          నా బ్లాగుకి సంబంధించిన విషయాల పట్ల నా ధోరణీ అలా ఉంటుంది.ఇదే కాదు,నేను ఏ పని చేసిన అఫుల్ క్లారిటీ తెచ్చుకున్నాకనే చేస్తాను!ఈ ముచ్చటైన మూడు కామెంట్లలోనూ నా క్లారిటీ ప్రకారమే నేను బిహేవ్ చేశాను.అప్పటికి నాకు శ్రీనివాస్ గారు పోష్టు పెట్టినట్టు నాకు తెలియదు.నా పద్ధతి ప్రకారం అంతటితో సమస్య అంతమైపోయిందని నా ఆఫీసు పనిలో నేనున్నాను.తర్వా ఎప్పుడో తీరిక దొరికినప్పుడు మాలికలో ఈ తలకట్టు చూసినప్పుడు కూడా అది నా గురించేనని నాకు అనుమానమే రాలేదు.గత కొద్ది రోజులుగా నీహారిక కొందరు బ్లాగర్లు పనిగట్టుకుని బూతులు రాయడం,వ్యాఖ్యాతలు వేస్తున్న బూతు కామెంట్లని ప్రచురించడం లాంటి విషయాలతో గొడవ చేస్తున్నది గదా దాని గురించి ప్రస్తావిస్తున్నారనుకున్నాను.తీరా చూస్తే నా బ్లాగులో కామెంట్లని నాకు చెప్పకుండా కాపీ/పేష్తు చేసి నన్ను సభ్యతా సంస్కారాలు లేనివాడిగా తీర్మానాలు చేస్తూ రాసిన పోష్టు అది - నా బ్లాగులో తన పేరు ప్రస్తావన వచ్చినందుకే అంత రోషం తెచ్చుకుని తను అడిగిన వెంటనే తను సూచించిన కామెంటును తీసేసిన నా మీద ఇన్ని ఆరోపణలు చేసిన పెద్దమనిష తను నా గురించి పోష్టు రాసిన విషయం నాకు తెలియపర్చాల్సిన బాధ్యతని ఎందుకు విస్మరించారో మరి!

          నేను తనకి మెయిల్లో పోష్టు రాస్తున్నానని చెప్పి టైం పట్టొచ్చు వెయిట్ చెయ్యమంటే thanks చెప్పిన మనిషే ఆగలేకుండా నా బ్లాగు దగ్గిర కంగారు కామెంట్లు వేసి మీ బ్లాగులో కాదు ఇక్కద చర్చించమని పిలుస్తున్నాడు - ఏమిటీ కుదురులేని తనం?ఎక్కడికి పడితే అకక్డికి వచ్చి ఎంతకాలం పడితే అంతకలం చర్చ;ల్లో మునిగి తేలే అవసరం నాక్లు లేదు.శ్రీనివాస్ గారికి నేను తన పోష్టు దగ్గిర వేసిన ప్రశ్నలు అర్ధం కాకపోవటం వల్ల వచ్చిన గందరగోళం ఇది. ఆ గందర్గోళాన్ని విడగొట్టి శ్రీనివాస్ KSC అనే మిత్రులు ఇద్దరూ చేసిన తప్పులే ఈ గొడవకి కారణం తప్ప ఈ గొడవ మొత్తంలో నేను చేసిన దుర్మార్గం ఏదీ లేదని అందరికీ క్లారిటీ ఇవ్వడమే నా లక్ష్యం, అంతే!

          పోష్టు మొదట్లో లింకు ఇచ్చాను గాబట్టి శ్రీనివాస్ గారి పోష్టు చదివే ఉంటారు.అయినా ఆయనకి అర్ధం కాని నా కామెంటుని ఇక్కడ వేస్తున్నాను.దాన్ని అర్ధం అయ్యేటట్టు విడమరిచి చెబితే చాలు నా పని పూర్తయిపోతుంది.మిగీనదంతా అదనపు వినోదం - పన్నులేమీ ఉండవు గాబట్టి ఉచితమే

          పది బ్లాగులు ఉండటం గురించీ నీహారిక మొదట్లో అడిగిన బూతుల గురించీ వేరే కామెంట్లు వేసినా విషయానికి సంబంధించి నా మొదటి కామెంటు ఇది:
@blogWriter
చౌదరి ఫోన్ చేసి ఆ కామంట్ మీరే పెట్టారు కదా అన్నాడు . 
లేదు నేను పెట్టలేదు అన్నాను . నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు .. 
లేదు సార్ అన్నా !
అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .." అన్నాడు .. 
నాకు తెలీదు నేనైతే కాదు అన్నాను
hari.S.babu
fact1:నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు ..
myPoint1:By this personal and deliberate statement He accepted at last He is working like an under cover spy/enemy against hinduism.
fact2:అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .." అన్నాడు ..
mypoint2:I even don't know exactly about you before,how could I tell your name?I am not having any personal contact with him - If he contacted me,It would appear as a comment!upto now I am confused you about B.SrininvasuDu as the similarity.HE IS A LIAR, LIAR AND LIAR!!!

P.S:The suspecting statement from me about you never done by me.Do you think this fellow with an iD is respectable and moral and anonymaous comm enters are mean and vulgar?
          ఇది కొంత విషయాంతరపు కామెంటే అయినా ఈ కామెంటు వెయ్యడం వెనక ఒక గొప్ప వ్యూహం ఉంది.ఆఖరిలో చెప్తాను.ఇందులో నేను శ్రీనివాస్ గారిని ఉద్దేశించి ఏమీ రాయలేదు గానీ ఇందులో ఏమి ప్లాను ఉందో అని మీకు సస్పెన్స్ పుట్టడం కోసం చెప్తున్నా - శ్రద్ధగా చదివితే తప్ప చివర్లో నా ప్లాను గురించి నేను చెప్పేది మీరు నమ్మలేరు!అర్ధం కాకపోతే మాయాబజారులా ఉంటంది - కాఫీలు తాగుతూ టిఫినీలు తింటూ రిలాక్సుడుగా కాకుండా ఇతర వ్యాపకాలేమీ పెట్టుకోకుండా సర్వేంద్రియాల్నీ లగ్నం చేసి చదవండి.

          ఇక శ్రీనివాస్ గారిని ఉద్దేశిస్తూ నేను వేసిన కామెంటు ఇది,ఇందులో వ్యూహాలూ వ్యూహాలూ రహస్యాలూ ఏమీ లేవ్చు,చాలా సూటిగా నేను ఆయన్ని అడిగిన ప్రశ్నలూ,నాకు ఆయన చేసిన అవమానానికి నేను చేసిన హెచ్చరికలూ మాత్రమే:

శ్రీనివాస్ గారూ!
మీరు ఇక్కడ ప్రచురించిన K.S.chaudari అభిప్రాయంలో మీ గురించి అతని అభిప్రాయం ఇది:"ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే."మీరు ఈ పోష్టులో రాసినదాన్ని కామన్సెన్సుతో చదివిన నాకే ఇదివరకటినుంచి ఇప్పటివరకు మీరే అతనిపైన ఇతర్ల విమర్శల్ని చూపించి ప్రతిస్పందించమని చెబుతున్నట్టు అర్ధం అవుతుంది.ఆ అలవాటు ప్రకారమే మొదట మీరే అతనికి చెప్పినా అతను మిమ్మల్నే బ్లేం చెసినట్టు కూడా మీరే చెప్పుకున్నారు.ఇది ఏ రకమైన స్నేహం?మీరూ అతనూ జోకులు వేసుకుంటూ ఉన్నప్పుడే తను మీమీద ఇలాంటి అభిప్రాయంతో ఉన్నట్టు అతని కామెంటుని బట్టే తెలుస్తున్నది,ఇవ్వాళ మీరేమో స్నేహంలో మోసపోవడం గురించి సెంటిమెంటు కురిపిస్తున్నారు!ఇవన్నీ మీ వ్యక్తిగతమైన విషయాలు,నాకు సంబంధం లేనివి.నేను పట్టించుకుని మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక విషయం ఉంది,జవాబు చెప్తారా? 

మీ సొంత విషయాలు నాకు అనవసరం గానీ అతను మీ గురించి నేను కొటేషన్లలో పెట్టి చెప్పినది నిజమేనా?అతను చెప్పింది నిజమయితే మీరు ఇంత ధైర్యంగా నా బ్లాగులోని విషయాన్ని మీ పోష్టులో పెట్టి నన్ను నిదియ్యటం గురివింద సామెతని నిజం చెయ్యటం అవుతుంది - సూటిగా చెప్ప్పాలంటే నన్ను అవమానించడమే అవుతుంది!మీరు అలా చెయ్యలేదని నిరూపించుకుంటే బాగుంటుంది,ప్రస్తుతానికి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ తన కామెంటులో ఇచ్చిన అతన్ని నిలదీస్తారో కలబదతారో వెలివేస్తారో మీ ఇష్టం,తన చేత అది అబద్ధం అని చెప్పించి క్షమాపణ చెప్పించుకోవటం మీ కనీస బాధ్యత.లేని పక్షంలో మిమ్మల్ని బండబూతులు తిడుతూ వరస పోస్టులు వేస్తాను - బస్తీ మే సవాల్!

P.S:నాకు స్వాభిమానం చాలా ఎక్కువ - అతను మీ గతచరితర్ గురించి చెప్పినది నిజం అని తెలిస్తే మాత్రం ఇక మీరు జన్మలో తల ఎత్తుకు తిరగడానికి వీల్లేనంత అవమానం నానుంచి ఎదుర్కొంటారు - ఖబడ్దార్!
          మొదట ఇందులో ఆయనకి అర్ధం కాక గందరగోళం పడాల్సిన విషయం ఏముందో నాకు అర్ధం కాలేదు!తర్వాత అర్ధమయింది - ఇతరులు తలకిందులుగా వెయ్యేళ్ళు తపస్సు చేసినా అర్ధం చేసుకోలేని విసహయాల్ని కూడా కన్ను మూసి తేరిచేటంత వేగంగా అర్ధం చేసుకోగలిగిన వాణ్ణి నేను నా స్థాయిలో మాట్లాడేశాను,ఆయనకి నా స్థాయి అందలేదు!

          "తెలుగు బ్లాగుల్లో ఉండకపోయినా అప్పుడప్పుడూ.........వ్రాయగలిగాడో అర్ధంకాక పిచ్చ్చేక్కింది .. " తర్వాత ఆయన నా గురించిన పది లైన్లకి ముందు ఆయన చెప్పిన విషయం ఏమిటి?శ్రెనివాస్,KSC  మధ్యన జరిగిన ఫోను సంభాషణ దేని గురించి?నాకు అర్ధం అయినది ఇది:వీళిద్దరికీ చాలా కాలం నుంచీ పరిచయం ఉంది.ఎలాంటి పరిచయం?KSC బ్లాగులకి దూరంగా ఉన్నప్పుడు బ్లాగుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు KSCని విమర్శిస్తూ కామెంట్లు వేసినా అన్నింటినీ గుర్తుంచుకుని KSC బ్లాగులకి అందుబాటులోకి రాగానే గుర్తు చేసేటంత దురద ఉంది శ్రీనివాస్ గారికి!తనవైపునుంచి "నేను నా స్నేహితుడికి ఎంత సహాయం చేస్తున్నానో" అని ఈయన పొంగిపోతూ గడిపేసి ఇవ్వాళ KSC "తొక్కలో స్నేహం!నువు నాకు చేసిన సాయం ఏంటి?గోంగూరకట్ట." అనేస్తే నీహారికతో ఓదార్పు సింపతీ తెచ్చేసుకుంటున్నాడు ఇప్పుడు,కానీ ఫోను సంభాషణ మొత్తాన్ని అది నడిచేటప్పటిలా హడావిడిగా ఇచ్చిన దాంట్లోనుంచీ ఆ కామెంటు అక్కడ పడిన తర్వాత వీళ్ళమధ్య జరిగిన కధని వరస ప్రకారం అమర్చి చూసి "ఏమయ్యింది...కొంతమంది బ్లాగర్లకు...ఇంత విరోధ విద్వేషాలెందుకు?" పోష్టులో KSCకీ శ్రీనివాసు గారికీ మధ్యన నడిచిన కామెంట్లని కూడా కలిపి చూస్తే వీళ్ళిద్దరి మధ్య్న ఉన్న అనుబంధం  ఏమిటో తెలుస్తుంది!

సంఘటన1)కామెంటు చూశాక్ మొదట జరిగినది శ్రీనివాస్ గారు KSCకి కామెంటు గురించి చెప్పటం
సంఘటన2).చౌదరి ఫోన్ చేసి ఆ కామంట్ మీరే పెట్టారు కదా అద్గ్గిరనుంచి నాకు తెలీదు నేనైతే కాదు అన్నాను వరకు వీళ్ళ మధ్యన ఫోను సంభాషణ జరగటం
సంఘటన3}.KSC అనామకంగా "పై కామెంటు దాత" అంటూ "ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే." అని శ్రీనివాస్ గారి పేరుని ప్రస్తావిస్తూ కామెంటు వెయ్యడం
సంఘటన4).శ్రీనివాసు గారు చదవగానే ఇది ఎవరు పెట్టి ఉంటారని మీరు భావిస్తున్నారు ? అనే ప్రశ్నతో ఆ కామెంటు వేసింది KSC అని నిర్ధారించుకుని KSCని నిలదియ్యటం
సంఘటన5).KSC ఈయనకి "మీరు నాగురించి పెట్టారు కదా .. అందుకే మీ గురించి అలా వ్రాసాను" అని జవాబు చెబితే శ్రీనివాస్ గారికి బాధ , కోపం రెండూ ఒకేసారి రావడం

          ఈయన పాటికి ఈయన "ఇంతకాలం ( దాదాపు నాలుగు సంవత్సరాలు) స్నేహితుడు అనుకొని అన్ని రకాలుగా (సారీ .. కొన్ని రకాలుగా) ఆదుకున్న నాపై ఇలా ఎలా వ్రాయగలిగాడో అర్ధంకాక పిచ్చ్చేక్కింది"  అని అయోఅమయం జగన్నాధంలా అమాయకత్వం నటిస్తూ హడావిడి చేస్తున్నాడు గానీ తను ఎందుకు శ్రీనివాసు గారి గురించి అట్లా ఎందుకు ఆలోచించాడో "ఏమయ్యింది...కొంతమంది బ్లాగర్లకు...ఇంత విరోధ విద్వేషాలెందుకు?" పోష్టులో KSC చాలా స్పష్టంగానే చెప్పాడు గదా - "మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే మీకు ఫోన్స్ రికార్డ్ చేసే భయకరమైన గుణం ఉందని గుర్తించి ఉంటే ఆరోజు నుండే అప్పుడప్పుడూ మీరు కాల్ చేస్తూ నాతో మాట్లాడే విధానానికి స్వస్తి చెప్పేసే వాడిని.మీరు ఆదుకునేoత  దౌర్భాగ్యపు స్థితిలో నేను లేను.ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు కలిపించకండి.గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. గతంలో నా బ్లాగులలో కూడా మీరు వివిధ ఐడిలతో కామెంట్ చేసేవారు కదా? ఆ విషయాలు నాతో కూడా పంచుకునేవారు కదా? మీరు అప్పుడప్పుడూ కావాలని చేసే వైరల్ దృష్టిలో పెట్టుకుని మీకు ఫోన్ కూడా చేసాను. కాని మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు." అని - శ్రీనివాసు గారు గతంలో చేశారని చెబుతున్నవి ఎలాంటి పనులు?నిజానికి ఈ పనులు చెయ్యనివాళ్లని ఏవరైనా ఈ పనులు మీరు చేశారు అంటే ఉలిక్కి పడతారు,నేనెప్పుడు అలా చేశానని నిలదీస్తారు,శ్రీనివాసు గారు మాత్రం  ఆ పనులు చెయ్యకుండా KSC తన పోష్టులో గానీ కామెంట్లలో గానీ ప్రస్తావించని కొండలరావు గారి పేరుని ప్రస్తావిస్తూ "పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు ... చూస్తాడు అని నమ్ముతాను నేను. మళ్ళీ మళ్ళీ కొండలరావు గారి గొడవ ఎందుకు వ్రాస్తున్నారు మీరు? ఆయన అనుమతి తీసుకున్నారా ?" ఆనే కామెంటు వేశారు.

          విషయం ఏమిటంటే,నేను వ్యూహాత్మకంగా వేసిన ఒక కామెంటుకు నేను ఆశించినట్టుగానే వచ్చిన ఈ అనామక వ్యక్తి కామెంటుకు పది బ్లాగులు తెరిచి అందులో యాడ్స్ పెట్టుకుని విజిటర్లు వాటిని క్లిక్ చేస్తే తనకు డబ్బులు వచ్చే ఏర్పాటు చేసుకుని హిట్ల కోసం ఇతరుల మతాల్ని అవమానిస్తూ ఆ మతం వారిని రెచ్చగొట్తి తన బ్లాగులకి రప్పించుకుంటున ఒక బటాచోరు తన కక్కుర్తి పనుల రహస్యాలు తను పోచికోలు కబుర్లుగా చెప్పుకున్న గొప్పల ద్వారా ఆ ఒక్క్క వ్యక్తికి మాత్రమే తెలుసన్న అహంకారపు వెధవాయిత్వంతో తన మీద విమర్శని తనకి చూపించి జవాబు చెప్పమని సూచించిన వ్యక్తినే దోషిగా నిలబెడుతూ అనామక వ్యాఖ్య వేసి అసలు వ్యక్తి గుర్తుపట్టి నిలదీస్తే అతనికి కూడా దొంగతనం అంటగట్టి రెచ్చిపోతున్నాడు!ఇనుముతో కలిసినందుకు సమ్మెట దెబ్బలు తింటున్న అగ్నిలా శ్రీనివాసు గారు నాతో తిట్లు తింటున్నారు - తన్ను మాలిన ధర్మంలా యెక్కడెక్కడి విమర్శల్నీ అతనికి చెప్పాలనే దురద ఆయన కెందుకు చెప్పండి!

          ఏదో ట్రాన్సులో ఉండి చదువుతున్నారు గాబట్టి అర్ధం గాక షాకులు గానీ తగిలితే తట్టుకుని కొంచెం బుర్రని సరిగ్గా ఉపయోగించి చూడండి - వీళ్ళ పరస్పర దుమ్మెత్తిపోసుకొనుడుకీ మధ్యే మధ్యే నామీద పడి ఏడుపుడుకీ కారణమైన నా బ్లాగులోని కామెంటు ఇది:

Anonymous7 October 2017 at 08:16
హమ్మ మహమ్మద్ చౌదరీ వుర్ఫ్ k.s.Chowdary...
@శ్యామలోయం, బ్లాగ్ వేదికా అనే వెబ్ సైట్ తో పాటుగా మరో పది వెబ్ సైట్ లను మైన్ టైన్ చేస్తున్నారు ఈ చౌదరి అనే ఆయన. ఆయనే సాక్శ్యం ఓనర్ కూడా. ఈ కామెడీ చూడండి... వాడే బ్లాగ్ వేదిక లో ఒక పోస్ట్ వేస్తాడు, వాడే అదే పేరుతో వాడి మరో సైట్ గురి/మ్చి ఒక లింక్ ఇస్తాడు. కావాలంటే బ్లాగ్ వేదిక పాత టపాలను చూడండి. చూస్తావుంటే ఈయన యాడ్స్ కోసం విపరీతంగా శ్రమిస్తున్నట్టు కనబడుతుంది.

alltechbook.net
andhratalkies.info
ateacher.info
govtjobsall.in
sakshyammagazine.com
sakshyammagazine.org
teacherguide.in
teachersvedika.net
etc., ...... + a lot of *.blogspot web sites!!!!

What is his hidden agenda, just to make the money from ads, or something else??

          ఇది చదవగానే KSC ఈ కామెంటు శ్రీనివాసు తప్ప ఇంకెవరూ వేసే అవకాశం లేదని అంత గట్టిగా ఎలా తీర్మానించుకోగలిగాడు?దానికి జవాబు తనే చెప్పాడు "నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు" అని, అవునా కాదా?

          KSC సంగతి తర్వాత చూద్దాం గానీ "అతను మీ గురించి నేను కొటేషన్లలో పెట్టి చెప్పినది నిజమేనా?అతను చెప్పింది నిజమయితే మీరు ఇంత ధైర్యంగా నా బ్లాగులోని విషయాన్ని మీ పోష్టులో పెట్టి నన్ను నిదియ్యటం గురివింద సామెతని నిజం చెయ్యటం అవుతుంది - సూటిగా చెప్ప్పాలంటే నన్ను అవమానించడమే అవుతుంది!" అంటున్న మొదటి ప్రశ్నలోనూ "ఈ తప్పుడుపన్లు మీరు చేశారని ఇక్కడ అతను అంటుంటే నన్ను ఎప్పటివో పాత బ్లాగుల్ని చూడమంటారేమిటి?మీరు అప్పుడు ఆ పనులు చేసి ఉంటే ఇప్పుడు నన్ను నిలదియ్యటం ఎట్లా కరెక్ట్ అవుతుందనేది నా ప్రశ్న - అర్ధమైందా?అప్పుడు అన్ని తప్పులు చేసి ఉంటే ఇవాళ మీరు నన్ను సభ్యత గురించి నిలదియ్యడం ఏమిటి?డబల్ మోరాలిటీ అవుతుంది - ఇది కూడా అర్ధం కాలేదా! " అని అడుగుతున్న ప్రశ్నలోనూ ఉన్నది ఏమిటో శ్రీనివాసు గారికి ఇప్పటికయినా అర్ధమయిందా?

          అర్ధమయ్యే ఉంటుంది,అయినా మరికొంచెం విశదం చేస్తాను - మీరు చేశారని అతను చెబుతున్న వెధవ పనులు మీరు నిజంగా చేసి ఉంటే ఇవ్వాళ నన్ను నిలదీసే అర్హత మీకు ఉండదు, అవునా కాదా?నేను కానీ కామెంటు వేసిన అనామక వ్యక్తి కానీ మిమ్మల్ని ఒక్క మాట అనలేదు,మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు,మీరు పిచ్చెక్కిపోవటానికి కారణమైనది KSC ప్రవర్తన - అతను మీకు అలా పిచ్చెక్కించటానికి కారణం అతనికి మీమీద ఉన్న అభిప్రాయం.ఆ అభిప్రాయం ఏర్పడటానికి మీరు గతంలో చేసిన వెధవపనులు కారణం అని అతను అంటున్నాడుఅతన్ని నిలదీసి అవన్నీ అబద్ధం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది అయితే నన్ను పాత పోష్టులు వెతుక్కోమనడం దేనికి చేస్తున్నారు మీరు?ఈ మొత్తం గొడవలో లీలామానుషవిగ్రహధారిలా ఒక చిలిపిపని చేసి అనామక వ్యక్తి నాకు కావలసిన లీలావినోదాన్ని జరిపించేలా చెయ్యడం తప్ప నాకై నేను మీరు మీ పోష్టులో నామీద చిందులు తొక్కాల్సినంత ఘోరమైన తప్పు ఏదీ చెయ్యలేదు.దేన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు.అతను మీ గురించి లిస్టు ఇచ్చిన వెధవ పనులు చెయ్యలేదని నిరూపించుకోవాల్సిన దుస్థితి మీదే!


          ఇంటర్వెల్ అయిపోయి జనాలు కాఫీలూ టిఫినీలూ తాగొచ్చేలోపు సినిమా కధే మారిపోయింది, "హార్నీ,ఇదేం చిత్రం!" - అనుకుంటున్నారా?నేను ఈమధ్యనే ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోగ్రామర్ని అయ్యాను - అదీ హరిమాయ లాంటిదే!మామూలుగా చూస్తే అక్కడేమీ ఉండదు,కానీ మేము తయారుచేసిన యాప్ మీ ఫోనులో ఎక్కించుకుని దాన్ని తెరిచి ఆ వ్యూఫైండర్ నుంచి చూస్తే అక్కడ లేనివి కూడా ఉన్నట్టు కనిపిస్తాయి.ఉదాహరణకి ఒక యాప్ లోడ్ చేసుకుంటే ఒక డైనోసార్ వచ్చేసి మీ ముందు కలయదిరుగుతూ ఉంటుంది - ఈ కధలోకి వూడిపడ్డ డైనోసార్ బ్లాగిల్లు శ్రీనివాస్ గారు!

          సారు నిజంగా డైనోసారే:-)జురాసిక్ పార్క్ చూసినవాళ్ళు అవి భయంకరమైనవి అనుకుంటారు గానీ నేను జువాలజీ స్టూడెంటుని కదా నాకు వాటి గిరించి పూర్తిగా తెలుసు!వాటిల్లో ప్రమాదకారులు ఏమీ లేవు - చాలా అమాయకమైనవి. అప్పటి కాలంలో వాటికి కావల్సిన ఆహారం దొరుకుతూ ఉండటంతో దొరికిన సమస్తం తినెయ్యడంతో శరీరాల సైజు పెరిగింది,ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రంలోని జీవ పరిణామ వాదం ప్రకారం బుద్ధి మాత్రం విలోమమే అయింది, ఆహారం పుష్కళం కావడంతో జాతి తామరతంపరైపోయింది, హఠాత్తుగా ప్రతికూలతలు వచ్చహెసరికి తట్టుకునేందుకూ ముప్పును తప్పించుకోవడానికీ ఉపాయాలు ఆలోచినంచుకునే పాటి సమయం కూడా దొరక్కపోవడంతో అంతరించిపోయాయి - ముందువెనకలు చూసుకోకుండా అమాయకంగా చేసీన వాటి పనులే వాటి కొంప ముంచాయి!

          నిజానికి నేను "బస్తీ మే సవాల్!","ఖబడ్దార్!" లాంటి మాటలు ఒక వ్యక్తిమీద వాడబోయేముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.మొదట ఆ వ్యక్తిలో ఏ కొంచెమైనా మంచితనం ఉంటే విని మారడానికి అవసరమైన మంచిమాటలు చెబుతాను,ఒకసారి కాదు మూడుసార్లు ప్రయత్నిస్తాను."ఇక వీడు మంచిమాటలకి లొంగడు!" అని గట్టి నిర్ణయం జరిగితే మాత్రం దాడి చాలా తీవ్రంగా చేస్తాను.సారు దగ్గిర మొదటిసారి ఆ పాలసీ పాటించలేదు,అది కూడా ఆలోచించి చేసిన పనే - యీయన చౌదరికి తోడుదొంగ అయితే మనం ఒక మంచివాణ్ణీ తిట్టామే అని గింజుకోనకరలేదు, ఒకవేళ తోడుదొంగ కాకపోతే ఈయనకి కాలినదాన్ని అటువైపుకి మళ్ళించడం నాకు తేలికవుతుంది - సారు ఇప్పుడు వేసిన పోష్టు దాని ప్రభావమే!నా పోష్టులోనే కాకుండా నా మెయిల్ ఐడీ పట్టుకుని "హరిబాబు గారూ,నన్ను ఇంతగ ద్వేషించడానికి కారణం ఏమిటి?" అని అడిగారు.మొదట ఈయన్ని కూడా బటాచోరు అంటున్న భాగాన్ని తీసెయ్యమని అడిగారు,నేను కాదనకుండా తీసెయ్యడానికి వెంటనే ఒప్పుకున్నాను.అయితే,KSCతో గట్టిగా వ్యవహరించమని చెప్పినప్పుడు KSC పోష్టులో లాగే "ఇదివరకు నాకు అన్యాయం చేసినవాళ్ళని దేవుడే శిక్షించాడు,ఇతన్ని కూడా దేవుడికే వదిలేద్దామనుకుంటూన్నాను!" అనే ధోరణిలో ఉన్నారు.అలా వదిలేసి ఉంటే ఈ వ్యవహారంలో మొత్తం అప్రదిష్ఠ అంతా సారు మెడకే చుట్టుకుని ఉండేది,ఎందుకంటే ఈయన బ్లాగులో వేసిన కామెంట్లలోనూ KSC పోష్టు దగిర ఈయన ప్రశ్నలకి చెపే జవాబుల్లోనూ తను చెప్పేది నిజమయినట్టూ శ్రీనివాసు గారే అబద్ధాలు చెప్తున్నట్టూ శ్రీనివాసు గారి మీద "మీరు సాయం చెయ్యకపొరతె నాకు గడవదా?","మన మధ్యన అంత స్నేహమే ఉంటే ఒక్కసారైనా కలిసేవాళ్ళం గదా!" ,"ఈ వ్యవహారం తొందరగా ముగించివెయ్యండి - నాకు చిరాగ్గా ఉంది!" అంటూ పెత్తనం చేస్తుంటే ఈయన తనే తప్పు చెసినవాడిలా అతన్ని బతిమిలాడుకుంటున్నటు మాట్లాడుతున్నారు.ఆ రెండు పోష్టుల్లోనూ వీళ్ళ సంభాషణ అట్లా ఉండటం వల్లనే నాకు ఈయన మీద అనుమానం వచ్చింది.అదే చెప్పాను - దాని ఫలితమే "ఇద్దరు మిత్రుల కథ అనబడు ఒక అజ్ఞాత(ని) సంచలన చిత్రం : మిస్ కాకండి" పోష్టు.

          అందరూ అనుకుంటున్నట్టు ఈ కధ ఈ మలుఔ తీసుకోవటానికి కారణమయిన అనానిమస్ కామెంటు వేసింది నేను కాదు - ఆ విషయాలు ఏవీ నాకు తెలియదు, తెలిస్తే నా సొంత ఐడీతోనే ఎప్పుడో వేసి ఉండేవాణ్ణి కదా!ఇంతకాలం ఎందుకు ఎదురు చూస్తాను?అది తెలిశాకనే అతని బ్లాగుల్లో ఎక్కడ క్లిక్ చేసినా యాడ్ పేజి ఓపెనవటం గురించి లైటు వెలిగింది - నేనూ కామెంటు వేశాను!దాంతో నాకు ఎక్కడ లేని హుషారు వచ్చేసింది - ఇంట్యూషన్ కావచ్చు,ఫ్యూచర్ బెల్స్ మోగడం కావచ్చు,నా ప్లాను మీద నాకు ఉన్న నమ్మకం కావచ్చు ఈ అనానిమస్ కామెంటూ దానికి నా రెప్లై కలిస్తే తప్పకుండా నేను ఎదురు చూస్తున్న రెస్పాన్స్ వస్తుందని అనిపించింది!ఈ కామెంటు రావడం కోసం నేను లీడ్ ఇవ్వడం గురించి చెప్పాను గదూ,ఒక్కటి కాదు మూడు కామెంట్ల తర్వాత ఇది వచ్చింది - నిజంగా అనానిమస్ ఈ లీడ్స్ అందుకునే వేసీన గ్యారెంటీ లేకపోయినా ఇప్పటివరకు చర్చల్లో వేసిన నా ప్రతి కామెంటుకీ ఎదటివాళ్ళు ఎట్లా రెస్పాండ్ వుతారని నేను వూహించానే అలాగే రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇది అనుకోకుండా వేసిన కామెంట్ కాదనీ KSC గురించి నేను వేసిన మూడు కామెంట్ల యొక్క ఫలీతమే అని అనుకుంటున్నాను.

          ఈ మూడు కామెంట్లూ "అయ్యా,ముష్టాఖ్ అహ్మద్!విగ్రహారాధనే అంత పాపమైతే దారి దోపిడీలూ మూకుమ్మడి చంపుళ్ళూ ఇంకెంత పాపం కావాలయ్యా?" పోష్టు దగ్గిర వేశాను:
మొదటి కామెంటు{
•Haribabu Suranenii4 September 2017 at 09:26
పూర్తిగాచెడిపోతున్నకాలేజీఅమ్మాయిలు!

1).అబ్బాయిలైతేదులుపుకుపోతారు.మరిఅమ్మాయిలపరిస్థితి? రేపుపెళ్లిచేసుకున్నవాడినిదారుణంగామోసంచేయడమేకదా!

2).లక్షణంగాచదువుకోవల్సినఅమ్మాయిలు..తమచేజేతులాఆవిరైపోతుంటేఆవేదనగావుంది.

3).ఒకవేళవారిప్రవర్తనబాగులేకపోతేవెంటనేపెళ్లిళ్లుచేసేయండి!అమ్మాయిలవిషయంలోఅయితేమరీతొందరపడటంమంచిదనినాఅభిప్రాయం.

P.S:ఇలాంటివాళ్లవాదనలన్నీతమాషాగాఉంటాయి.అబ్బాయిలుచెడిపోయినాపర్లేదుగానీఅమ్మాయిలుమాత్రంచెడిపోకూదదంటేచెదిపోవాలనుకున్నఅబ్బాయిలకిఅమ్మాయిలదొరకడంయెట్లా:-)

నైతికతగురించిచెప్పదల్చుకుంటేఇద్దరికీసమానంగానేచెప్పాలి - This one-sided-morality is defenitely has islaamic roots.

Yes,That proves the multiple identities of a single person!Except in saakshyamgroup,nowhere he is talking about religion - that I suspect as a precaution to project himself as a gentleman..As Iconoclaust successfully revealed that he is partial to men,My conclusion is he is propagating Islamic morality!He is blaming only girl,why?Because Islam never condemns a man!
రెండవ కామెంటు{
Haribabu Suranenii8 September 2017 at 05:10
అన్నీఒక్కడే, అంతటాతానే - పేర్లుమారినాతీరుమాత్రంఒక్కటే, అదేదరిద్రం!
మూడవ కామెంటు:
Haribabu Suranenii22 September 2017 at 05:06
Hello Mr.M.A.Abhilash,
========================
https://blogvedikanews.blogspot.in/2014/11/blog-post_8.html

https://ahmedchowdary.blogspot.in/2014/07/blog-post_25.html

so ahmed chowdary, sakshyam group, blogvedika, manodairy, rachabanda are all same.

Yes,That proves the multiple identities of a single person!Except in saakshyam group,nowhere you are talking about religion - that I suspect as a precaution to project himself as a gentleman.

ఏం నాయనా!చైనావాడు భారత్ చుట్టూ ముత్యాలసరం ప్లానేసినట్టు నువ్వు హిందువుల చుట్టూ పది బ్లాగులు పెట్టి ఒక్కో బ్లాగులో ఒక్కో వేషం వేస్తున్నావా?


As Iconoclaust in that post successfully revealed that you are propagating Islamic morality!You are blaming only girl,why?Because Islam never condemn a man!

https://ahmedchowdary.blogspot.in/2014/07/blog-post_25.html
పూర్తిగా చెడిపోతున్న కాలేజీ అమ్మాయిలు!
మీలాంటివాళ్ల వాదన లన్నీ తమాషాగా ఉంటాయి.అబ్బాయిలు చెడిపోయినా పర్లేదు గానీ అమ్మాయిలు మాత్రం చెడిపోకూడదంటే చెడిపోవాలనుకున్న అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం యెట్లా:-)

నైతికత గురించి చెప్పదల్చుకుంటే ఇద్దరికీ సమానంగానే చెప్పాలి,కానీ నువ్వు అబ్బాయిలు చెడిపోయినా పర్లేదు గానీ కడుపొస్తుంది గాబట్టి అమ్మాయిలు చెడిపోకూడదు అంటున్నావు - This one-sided-morality is definitely has Islamic roots.
========================
జనానికి లౌకికమయిన నీతిని చెప్పడంలో కూడా ఇంత నికృష్టుడివి నీకు మతప్రచారం దేనికిరా!

          మొదటి కామెంటు కంటెంటుకి సంబంధించిన సీరియస్ కామెంటు.కానీ, అది వేస్తుండగానే కలుగులో ఉన్న ఎలుకని బయటికి లాగటానికి ఆ పద్ధతి పనికిరాదనే ఐడియా వచ్చి ఈ కామెంటు వేశాను.అప్పుడే నేను ఆ లీడ్ పట్టుకుని ఈ అనానిమస్ ఇప్పుడు వదిలిన కామెంటు లాంటిది వదులుతారని ఎంతగానో ఎదురు చూశాను.

          మనోడైరీ సైటుకి రెండోసారి వెళ్ళినప్పుడే ఇతని దశముఖాల గురించిన క్లూ దొరికింది.ఆ పోష్టులో ఉన్న తమాషా ఏమిటంటే,తన మగతనాన్ని కూడా దాచుకుని అదేదో సినిమాలో బ్రహ్మానందం తల్లీ కొడుకుల వేషాలు వేసి కొడుకుని చావుతిట్లు తిట్టే తల్లి వేషాన్ని ఎట్లా రక్తి కటించాడో అట్లానే ఈ కళాకారుడు ఒక పెద్ద ముత్తయిదువ ఈ కాలం ఆడపిల్లల గురించి అలమటించిపోతున్నట్టు ఆడంగి రాతలు రాశాడు!శ్రీనివాసు గారు తనని హీరో అన్నారు గానీ ఈ కధలో తనే అన్నీ - హెరోయిన్నూ, విలన్నూ, కమెడియన్నూ కూడా తనే!మొదట హిందూమతం వేషం కట్టి తనకి జరుగుతున్న మానభంగం నుంచి బయటపడెయ్యమని అలమటించే హెరొయిన్ను అయ్యాడు, తర్వాత హిందూమతం గురించి అబద్ధాలు చెప్పీ ఆ హెరోయిన్ని  రేప్ చేస్తున్న విలన్నూ అయ్యాడు, హిందువులు రెచ్చిపోయి వీణ్ణి ఆపడానికి వస్తే రూటు మార్చి హిందూ, క్రైస్తవ మతతత్వ వాదుల నుంచి ఉమ్మడి మతాల్ని కాపాడుతున్న హీరో వేషం కట్టాడు!వీటిల్లో బైటికి కనబడే క్యామెడీ లేదు - అది అంతర్నదిలా ఉంటుంది, కనుక్కోగలిగినవాళ్ళు ధన్యులు!

          తమతో గొడవ పెట్టుకున్న జనాల పడగ్గదుల్లో కెమెరాలు పెట్టి వాట్ని సోషల్ మీడియాలో పోష్టు చేస్తున్న కాలంలో పుట్టి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుంటున్న పాతకాలం పిల్లిలా తను చెప్తే తప్ప తన గురించి ఎవడికీ తెలియదని ఎట్లా అనుకుంటున్నాడో!తెలిసిన ప్రతివాడూ ముఖం మీద వుమ్మెయ్యకపోవడమే ఇతను వాళ్ళకి తన గురించి తెలియదనుకోవడానికి కారణమా?ముష్టాఖ్ అహ్మద్ గురించి ఒక అనామక వ్యక్తి అతనికి కాళ్ళు చచ్చుబడ్డాయనీ చక్రాల కుర్చీలో తిరుగుతూ ఉంటాడనీ సాక్ష్యం మ్యాగజైను దగ్గిర కామెంటు వేశాడు,దాన్ని ప్రస్తావిస్తూ నేను దేహానికి అవకరాలు ఉంటే జాలిపడవచ్చు గానీ బుద్ధికి అవకరాలు ఉంటే ఆ మనిషి మీద అసహ్యమే వేస్తుంది తప్ప జాలి పుట్టదు అని కామెంటు కూడా వేశాను.ముష్టాఖ్ అహ్మద్ గురించి తెలుసుకోగలిగినవాళ్ళు సత్యనారాయణ చౌదరి గురించి తెలుసుకోలేరా!వాళ్ళలో ఈ అనామక వ్యక్తి ఒకడు - మొత్తానికి KSCని CSKని చేసే సునామీని పుట్టించాడు తన కామెంటుతో.

          నిజానికి సాక్ష్యం మ్యాగజైను దగ్గిర వాదనలు చెస్తున్న మొదటి రోజునుంచీ నాకు అయోమయమే - మిగిలిన వాళ్ళూ నేనూ అక్కడ అతనికి చేసిన హితబోధకి కేవలం మతప్రీతి మాత్రమే ఉంటే ఎప్పుడో మారి ఉండేవాడు,అలా మారకపోవటానికి అతను లాభం కోసం మతాన్ని ఉపయోగించుకోవాలనుకోవడమే కారణం!అయితే,అధికారం కోసం అయోధ్యలో రామాలయాని నిర్మిస్తాన్నని చెప్పిహిందువుల రామభక్తిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక ఆ మాటే ఎత్తకుండా రామభక్తుల్ని మోసం చేస్తున్న బీజేపీకి మరోసారి వోట్లు వెయడానికి సిద్ధమౌతున్న మనం ఇతన్ని మాత్రం ఏమి తిట్టగలం?ఏమి చెయ్యగలం!మెయిల్లో యాగ్రిగేతరు హోదాలో మిగిలిన యాగ్రిగేటర్లతో మాట్లాడి తని పేరుమీద ఉనన్ సైట్లని తొలగించి వెయ్యమని నేనే సలహా ఇచ్చినా అప్పుడున్న మూడ్ ఇప్పుడు లేదు,సాంకేతికంగా అది మరీ దుర్మార్గం అవుతుందేమోనని నాకే సందేహం!

          గుర్రం గుడ్డిదయినా దాణాకి తక్కువ లేదన్నట్టు తప్పుడు పనులు చేస్తూ కూడా ఎంత అహంకారం చూపిస్తున్నాడు,నాకు "మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?" ఇస్తూ "ఏమిటీ వాగుడు?" అని గద్దిస్తున్నాడు.ఈ గొట్టాంగాడు సలహా ఇచ్చేవరకూ ఆగుతానా?"నేను అంతమంది దేవుళ్ళకి దేవుళ్ళకి దణ్ణం పెట్టను,ఒక్క దేవుడికే దణ్ణం పెడతాను" అనే పోష్టుకి జవాబు అక్కడ వెయ్యకుండా నా పోష్టులో ఎందుకు వేశానననుకున్నారు?ఇలాంటి విషయాల్లో నేను పాదరసం కన్న చురుకైనవాణ్ణి!

          అసలు ఈ మనిషిలో ఉన్న కామిడీ విలనీకి పరాకాష్ఠ ఆ కామెంటు శ్రీనివాసు గారు వేసినట్టు హరిబాబు అన్న నేను అహ్మద్ చౌదరి అన్న తనకి చెప్పానని అబద్ధం చెప్పడం,ఎంత అహంకారం/అజ్ఞానం/మొండితనం/సిగులేనితనం ఉండాలి అంత పచ్చి అబద్ధం చెప్పడానికి?తన ఫోను నంబరు నాకు తెలీదు,నా ఫోను నంబరు తనకి తెలీదు - నా బ్లాగు దగ్గిర కామెంట్లుగా తప్ప మరో విధంగా మా మధ్యన సంభాషణ జరిగే వీలుందా?ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది అంత ధీమాగా నాపేరు ఎలా చెప్పగలిగాడా అని!అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే,నాకెవరయినా శ్రీనివాసు గారు చెప్పినట్టు "నాకొక ఆలోచన వచ్చింది .. ఆర్ధిక సమస్యలతో కొట్టిమిట్లాడుతున్న మన స్నేహితునికి నా వ్యాపార రహస్యాలు చెప్పాను. ప్రోత్సహించాను ... తనూ ఆ రంగంలో దిగేలా ప్రోత్సహించాను. నాకొస్తున్న ఆదాయంలో 10% వచ్చినా ఈయన సుఖంగా ఉంటాడని ఆశించాను." అనే రకం సాయం చేస్తే కళ్ళకద్దుకుని స్వీకరించేవాణ్ణి!ఈరోజుల్లో వ్యాపార రహస్యాలు కూడా చెప్పి ప్రోత్సహించేవాళ్ళు ఏవరున్నారండి!పోనీ,ఒకడు చెప్పింది నేనెందుకు వినాలి అనుకున్నా సొంత తెలివితో ఆలోచించి గుడి దగ్గిర కొబ్బరిచిప్పల షాపు పెట్టినా గడిచిపోయేది - ఏవడీ దిక్కుమాలిన ఐడియా ఇచ్చాడో గానీ పోయి పోయి ఫైరింజన్ల షాపు పెట్టాడు.

          అదేదో సినిమాలో చార్లీ చా[ప్లిన్ వృత్తి ఏమిటో తెలుసా - పగిలిపోయిన కిటికీ అద్దాల్ని మార్చటం,మామూలుగా యైతే ఎప్పుడో గానీ పగలవుగా - అందుకని ఒక ఐడియా వేస్తాడు.వీడి పక్కనే ఒక పిల్లాడు ఉంటాడు,వాడి పని అద్దాలు పగలగొట్టటం,వాడు పగలగొట్టిన ఇంటికి అద్గ్గిర్లో వీడు తచ్చాడుతుంటే ఆ ఇంటివాళ్ళు పిలిచి మరీ కిటికీల్ని బాగు చేయించుకుంటారు.మనోడు కూడా అదే ఐడియా అవెశాడు.తన ఫైరింజన్లకి డిమాణ్దు రావటంకోసం తనే కొంపలకి నిప్పు పెడుతున్నాడు - హిందూమతం తేరగా దొరికింది వీడికి!క్రైస్తవుల కున్నంత తెలివి హిందువులకి లేదు గనక పొలోమని పోయి వీడికి ఆదాయం పెంచటం మొదలుపెట్టారు.దహార్ అత్క్కువ బంగారానికి మెరుగు ఎక్కువ కదా తన పధకం పారిందని తెలిసేసరికి అది వరకు ఉన్న కాస్త లోకజ్ఞానం కూడా పోయి చావుతెలివి పెరిగింది - చావు తెలివి కాకపోతే ఇంత అడ్డంగా ఎవడు దొరికిపోతాడు?

          తను నాకు ఇచ్చిన ఉచితబోడీసలహాకి "ఏమయ్యింది...కొంతమంది బ్లాగర్లకు...ఇంత విరోధ విద్వేషాలెందుకు?" అని వేసిన తన పోష్టు దగ్గిర నేను ఇచ్చిన కౌంటర్ ఇది:

@YOU
ఇక హరిబాబు గారూ!
ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.

మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

hari.S.babu
>>మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

మీ బ్లాగులో కామెంటు పెట్టదం ఇష్టంలేకనే సాక్ష్యం అన్యాపదేసపు పోష్టుకి నా బ్లాగులోనే కామెంటు వేశాను!ఇక్కడ ఇంత సూటిగా నా పేరు ప్రస్తావించి సలహాలు ఇచ్చినప్పుడు అక్కడ అన్యాపదేశం ఎందుకు వాడినట్టో?నీతి,సభ్యత గురించి మీ దగ్గిర పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో నేను లేను.మీ బ్లాగు రచయితల్లో నాకన్నా వయస్సు ఎక్కువ ఉన్నవాళు ఉన్నారని అంటున్నారు.కేవలం వయస్సుతోనే పెద్దరికం వస్తుందా?అలా ప్రతివాడికీ వయసును బట్టి మంచి బుద్ధులు,సంస్కారం,అనుభవం,జ్ఞానం వస్తే ఇంక నేరాలు ఎందుకు జరుగుతున్నాయి?వారి వయస్సుకీ,చదువుకీ,అనుభవానికీ ఆయన చేస్తున్నది తప్పని ఆయనకు తెలియదు అంతే నమ్మడం కష్తం!నేను ఆయన బ్లాగు గురించి చెప్పిన అభిప్రాయానికి నూటికి నూరుపాళ్ళు కట్టుబడి ఉంటాను. అని నేను అన్నమాతకి అనుగుణంగ అలా తమకి ఆదాయం పెంచుకోవటానికి ఈతర మతాలని దుమ్మెత్తిపొయ్యదం వయస్సూ,చదువూ,లోకజ్ఞానం ఉన్నవాళ్ళు చెయ్యాల్సిన పనేనా?నేను కిమల్ని వెధవ అంతే "మాఎమూ అనగలం?" అనేటంత తేంజిలో కోపం వచ్చినప్పుడు హిందువులకి తమ మతాన్ని మీరు విమర్శిస్తుంటే కోపం రాదని యెందుకు అనుకుంటూనారు?ప్రపంచంలో అవమానానికి బదులు చెప్పే హక్కు మీకు మాత్రమే ఉందా?హిందువులకి ఉండకూడదా?కావాలని రెచ్చగొట్టే రాతలు రాసి నేను తిట్టానని యేడవకపొతే ఆ రాతలు రాయకుండా ఉండొచ్చు గదా!మీరు తప్పు చెయాలి,కానీ ఏవరూ తిట్టకూడదు - మీరేం లార్డు రీడింగు బామ్మర్దా?

పిచ్చిపులయ్య అన్నాను నిజమే!ఎందుకు అన్నాను?ఒక ప్రశ్నకి ఎన్నిసార్లు జవాబు చెప్పినా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేస్తుంటే ఎంత వరకు సహించాలి?ఒక ముస్లిం తన మతంలో ఉన్న మంచిని చెప్పుకోవడం మానేసి నా మతాన్ని తప్పులు పడుతూ ఉంటే వ్యతిరేకించడం తప్పా?

ఈ మొత్తం వ్యవహారంలో మీరు ఇన్నేసి బ్లాగుల్ని నడపటం యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసమేనని మీకు మీరే బయటపెట్టుకున్నారు - అవునా కాదా?మీరు హిందూమతాన్ని కెలుకుతున్నది కూడా ఎక్కువ హిట్స్ కోసమేనని కూడా సాక్ష్యాధారాలతో రుజువయ్యాక మీరు నాకు నీతులు చెప్పదం కాదు చెయ్యాల్సింది సిగ్గుపడి తల యెక్కడ పెట్టుకోవాలో తగిన చోటు కోసం వెదుక్కోవడం!


P.S:మీ కీబోర్డుల్ని ఎట్లా వాడితే మీ బ్లాగులకి ఎక్కువ హిట్లు వస్తాయో అట్లా వాడుతూనే ఉన్నారుగా - లేవని ఎట్లా అనుకుంటాను.రీసెంట్ అఫైరులో మొదటి అనామకం కామెంటూ మరియూ బ్లాగిల్లు శ్రీనివాసుతో ఆ పోష్టు దగిర మీ వాదనలూ మిమ్మల్నే అభాసుపాలు చేస్తున్నాయని తెలిసి కూడా ఈ పోష్టు వేసి నాకు సలహాలు ఇవ్వదం చూస్తుంటే మీ తెలివితేటల మీద జాలిగా ఉంది!ఏయే బ్లాగులు ఏఏ ఉదేశంతో మీరు నిర్వహిస్ద్తున్నారో ఇదివరకు తెలియని పిల్లా జెల్ల గొడ్డూ గోదా యావన్మందికీ మరింత విశదం అయిపోయింది.ఈమొతం గొడవలో మీరు ప్రవర్తించిన తీరులో మీకు గౌరవప్రదమయైనది యేదీ లేదు.నా ఉచ్చులో చిక్కుకుని మీ చేతుల్తో మీరే పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి ఎలా పొందాలో దాని గురించి ఆలోచించుకోండి!

హరిబాబు అంటే అల్లాటప్పాగోంగూరకట్ట అనుకున్నారు కాబోలు - చాణక్యుడికి కూడా పాఠాలు నేర్పగైలిగిన వ్యూహకర్త!చదరంగంలో ఉన్న అన్ని యెత్తుగదల్నీ - ఆఖరికి నన్ను నేను బలిపెట్టుకోవడం లాంటి యెత్తులతో ఒక్కొక్క మెట్టూ నేను మిమల్ని నడిపించుకుంటూ వస్తే ఇవ్వాళ మీరున్న దిక్కుమాలిన పరిస్థితి దాపరించింది మీకు - తెలుసుకుని బుద్ధిగా మసులుకోండి!

శ్రీనివాస్ గారితో ఫోనులో కచ్చగా అన్నట్టు ఆయనకి తప్ప యెవరికీ తెలియకుండా చైనా వేసిన గార్లాండ్ ప్లాన్ లాంటి మీ ప్లాన్ గురించి అవునని ఒప్పేసుకుని వూరందరికీ టాం టాం వేసుకోవడం తప్ప మీరు సాధించింది ఏమిటి?దీన్ని ఇంకా పొడిగించకండని ఇతర్లకి సలహాలు ఇస్తున్నారు - పొడిగిస్తే నష్టం ఎవరికి?మాకా మీకా!

          ఈ కామెంటు 14నే వేశాను,బహుశా మళ్ళీ బ్లాగులకి బయట ఉన్నాడేమో:-)మళ్ళీ బ్లాగుల్లోకి వచ్చినా రాకపోయినా కామెంటు వేసినా వెయ్యకపోయినా KSC పరిస్థితిలో రాగల పెద్ద మార్పేమీ ఉండబోదు!తను ధీమాగా చెప్పినట్టు హిందువులు ఎవరూ ఇంక అతని బ్లాగులకి వెళ్ళకండి,వెళ్ళినా చూసి వచ్చెయ్యండి తప్ప కామెంట్లు వెయ్యకండి, ఒకవేళ జవాబు చెప్పాలని అనిపిస్తే నేను చేసినట్టు మీ సొంత బ్లాగులోనో వేరే బ్లాగులోనో వెయ్యండి - అక్కడ వేసి అతనికి ఆదాయం పెంచాల్సిన అవసరం మనకి లేదు.

       అతను ప్రచురించినా ప్రచురించకపోయినా నా కామెంటుతో సినిమా అయిపోయింది.కకపోతే శుభం కార్డు వెయ్యబోయేముందు వాయిస్ ఓవర్ కొంచెం ఉంది,అది కూడా వినేస్తే నాకు తుత్తిగా ఉంటుంది.ఈ కధ మొత్తం రక్తి కట్టించినది అనామక వ్యాఖ్యాతలే అయినప్పుడు అనామక వ్యాఖ్యాతల మీద పూర్తి నిషేధం మంచిది కాదని అనిపిస్తున్నది నాకు. తమకు తెలిస్దిన ఇలాంటి కీలకమైన నిజాల్ని చెప్పాలని ఉన్నా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు బహిరంగంగా చెప్పలేని వాళ్ళు ఉంటారు.అదీగాక కొందరికి కేవలం చెప్పేది ఇలాంటి ప్రమాదకరమైన విషయం కాకపోయినా తమ అభిప్రాయాల్ని చెప్పటమే తప్ప తమ పేరును చూసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు.ఇంక బూతుల విషయానికి వస్తే అవి హిందూ ద్వేషుల నుంచే వస్తున్నాయి - ఒకప్ప్పుడు మలక్ పేట రౌడీ గారి పోష్టుల దగ్గిర రాని బూతులు ఇప్పుడు రావటమే దానికి సాక్ష్యం!అప్పూడు సంఖ్యకి తక్కువ ఉన్నపటికీ హైందవేతరులే ఆధిక్యంలో ఉన్నప్పటికీ హిందువులు ఎదటివాళ్ళని ఎంతసేపూ పాయింటు చెప్పి ఒప్పించాలనే చూశారు గానీ సహనాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.మరీ నిరాశ పుట్టినప్పుడు అంతటితో వాదన ఆపేసి వూరుకున్నారే తప్ప కొబరిచిప్పల బ్యాచ్చి అనవద్దు అంటే "..మదపిచ్చిగాళ్ళు అంటాను సరేనా!" అన్న అధముడిలా ప్రవర్తించలేదు.ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు "మోడీ వచ్చాక హిందూత్వం పెరగడం ఏంటి, మీ బొంద!హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరౌలకి ఓటు వెయ్యకూడదని బీజేపీకే వెయ్యడం వల్ల మోదీ ప్రధాని అయ్యాడు!హిందువులు అంతలా ఐక్యం కావదానికి డెబ్భయ్యేళ్ళ నుంచి మీలాంటివాళ్ళు చేసిన నిర్వాకమే కారణం!" అని - ఇంకా అర్ధం కావడం లేదు వాళ్ళకి.నా వైపు నుంచి నేను సాక్ష్యం దగ్గిర తప్ప ఇంకెక్కడా ఎవరినీ తిట్టలేదు -అక్కడ కూడా స్త్రీలని ఇబ్బంది పెట్టే మాటల్ని అస్సలు వాడ్లేదు.ఇప్పుడిక KSC గురించిన నిజం తెలిసింది గాబట్టి ఆ కాస్త ఉద్రేకం కూడా ఉండదు నాకు.

          ఎలాగూ బ్లాగు సెట్టింగ్స్ లోనే మోడరేషన్ ఉన్నప్పుడు మళ్ళీ యాగ్రిగేటర్లు కలగజేసుకుని అసలు కామెంట్లనే యెత్తెయ్యడం ఓవర్ యాక్షన్ అవుతుందేమో!బ్లాగర్ల విచక్షణాధికారం ప్రకారం నడవాల్సిన విషయాల్లో యాగ్రిగేటర్లు అతిగా కల్పించుకోవడం సాంకేతికంగా న్యాయం కాదు.మాలిక వారు నీహారిక బ్లాగును తొలగించడం కూడా మర్యాద కాదు.తను నాకు ప్రశ్నలు వేసినప్పుడు జవాబులకి కండిషన్ పెట్టడం వల్ల నేను జవాబులు చెప్పడానికి తిరస్కరించాను.ఇప్పుడు తన వాదనలో న్యాయం ఉందనే అనిపిస్తున్నది - తనని బ్లాగుల నుంచి తొలగించడం అన్యాయమే!సనాతన ధర్మం దృష్టిభేదాల్ని(perspective differences) సమర్ధిస్తుంది."విశ్వసృష్టి రహస్యం మేడెజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!" పోష్టులో చాలా చెప్పాను,మళ్ళీ అవన్నీ చెప్పే ఓపిక లేదు గానీ అక్కడ చెప్పని విషయం ఒకటి చెబుతున్నాను.దైవాసుర సంపద్విభాగ యోగం నిరంతరం నడవాలంటే అమరశక్తులకి ప్రాతినిధ్యం వహించే హరిబాబుతో పాటు అసురశక్తులకి ప్రాతినిధ్యం వహించే నీహారిక కూడా ఉండాల్సిందే - మన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికీ మన రహస్యాల్ని దాచుకోవటానికీ,మన అధికారాన్ని చూపించుకోవటానికీ ఎదటివాళ్ళని మాట్లాడనివ్వకుండా చేస్తే చాలుననుకుంటే ఒకనాటికి మనకి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి దాపరిస్తుంది!అబద్ధాలు చెప్పాడని సత్యనారాయణ చౌదరిని తిడుతున్నప్పుడు నిజాలు మాట్లాడుతున్న నీహారికని నిషేధించడం కూడా తప్పే అవుతుంది.


హమ్మయ్య!సినిమా అయిపోయింది - రివ్యూలు రాసేవాళ్ళు రాసుకోవచ్చు.

Sunday 8 October 2017

సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందా?జనని సంస్కృతమ్ము సకల భాషలకు అనేది అసత్యమా?

          నాకు ప్రాచీన చరిత్ర కోసం వెదుకుతున్నప్పుడల్లా మౌర్యసామ్రాజ్యం మ్యాపూ శాతవాహన సామ్రాజ్యం మ్యాపూ చూస్తుంటే ఒక డౌటు మళ్ళీ మళ్ళీ వొస్తుండేది - "కిందా పైనా కుడీ ఎడమా అన్ని ప్రాంతాల్నీ జయించినవాళ్ళు ఇప్పుడు తమిళనాడు,కేరళ రాష్ట్రాల ప్రాంతాన్ని ఎందుకు వదిలేశారు?" అని!

          శాతవాహనుల రాజ్యం మొదటినుంచీ ఆఖరువరకూ ఇలానే లేదు,కానీ అతి ఎక్కువ విస్తారం ఉన్నప్పటి మ్యాపు ఇది.ఎటూ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడే ఒక విషయం చెప్పాలి.మౌర్యవంశం చాణక్యుని శిష్యుడైన చంద్రగుప్త మౌర్యునితో క్రీ.పూ 322లో మొదలై క్రీ.పూ 187లో బృహధ్రధునితో ముగిసిపోయింది.మొత్తం 135 సంవత్సరాలు మాత్రమే!చంద్రగుప్తుడు->బిందుసారుడు->అశోకుడు-->బృహద్రధుడు -అయిదారు తరాలతో అయిపోయింది.వింధ్యకి దిగువన ఉన్న ప్రాంతాన్ని ఎక్కువకాలం తమ అధీనంలో ఉంచుకోలేకపోయారు.

          ఇక గుప్త సామ్రాజ్యం క్రీ.శ 320లో మొదటి చంద్రగుప్తుడితో మొదలై క్రీ.శ 550లో స్కందగుప్తుడితో అంతరించిపోయింది.మొత్తం 230 సంవత్సరాల కాలం!శ్రీగుప్తుడు(ఘటోత్కచుడు)->చంద్రగుప్తుడుI->సముద్రగుప్తుడు->రామగుప్తుడు->చంద్రగుప్తుడుII(విక్రమాదితుడు) ->కుమారగుప్తుడు->స్కందగుప్తుడు - ఏడు తరాలతో ముగిసిపోయింది!దక్షిణ భారతం మీద వీరి ప్రాభవం చాలా తక్కువ.

          ఇక శాతవాహనుల్లో మనకి తెలిసిన శ్రీముఖ శాతకర్ణి యొక్క జీవితకాలం దొరికిన శాసనాలను బట్టి క్రీ,పూ 271 అని తెలుస్తున్నది.ఆఖరి రాజైన 5వ పులోమావి క్రీ.శ 225 వరకు పరిపాలించాదని తెలుస్తున్నది.ఇప్పుడు మనం మొదటివాడు అని శ్రీముఖ శాతకర్ణిని గురించి చెబుతున్నది స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు అని మాత్రమే తప్ప అతనే మొదటి వాడు కాదు, వంశం అంతకు ముందునుంచే ఉంది - మౌర్యులకు సామంతరాజుల హోదాలో!అంటే, మొత్తం 500+ సంవత్సరాల కాలం పాటు ఉనికిలో ఉంది,పురాణాలు 30 మందికి పైన పేర్లని చెబుతున్నాయి. విస్తృతి చూస్తే ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్త్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలను ప్రభావితం చేయగలిగినంత ఉండి రెండు రాజధానుల్ని ఏర్పరచుకోవలసి వచ్చింది.అయినా మనం చిన్నప్పుడు మౌర్యసామ్రాజ్యం గురించీ స్వర్ణయుగం లాంటి గుప్తుల కాలం గురించీ తప్ప శాతవాహనులను గురించి చదివిన జ్ఞాపకం ఏమైనా ఉందా?చరిత్రకారులు కావాలని చేసిందా లేక చరిత్ర పుస్తకాలు రాసేవాళ్ళు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకుని అలా చేశారా అని తర్కవితర్కాలకి పోకుండా ఉత్తర భారతపు గొప్పని దక్షిణ భారతం మీద రుద్దడం తప్ప దక్షిణ భారతం గొప్పని ఉత్తర భారతం ఎందుకు తెలుసుకోవడం లేదు?ఒకవేళ కావాలని చెయ్యకపోయినా పదే పదే జరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు వీటిని పట్టించుకుని అనుమాన నివృత్తిని చెయ్యాల్సిన అవసరం లేదా?

          తమిళం, సంస్కృతం గురించి చెప్పడానికి బదులు ఈ ఉత్తరాది అధిపత్యం గురించి ఎందుకు ఎత్తుకున్నానని మీకు అనుమానం రావచ్చు - తమిళుల రాజకీయ మనస్తత్వంలో ఉన్న ఉత్తరాది వ్యతిరేకత అనేది అతి ముఖ్యమైనది కాబట్టీ సంస్కృతానికి పోటీగా తమిళాన్ని నిలబెట్టటంలో ఉన్నది కూడా రాజకీయమే కాబట్టి మొదట దానిని గురించి పరిశీలించుదామని యెత్తుకుంటే వారి ఆరోపణలు కొంతవరకు నిజమేనని నాకూ అనిపిస్తున్నాయి.కేసీయార్ గానీ తెలంగాణ ఉద్యమవీరులు గానీ రాష్ట్రం మా వీరత్వం వల్లనే వచ్చిందని భ్రమపడవచ్చు గానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొత్తం ఉత్తరాది లాబీయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టటం వల్ల తమకు రాబోయే ప్రయోజనాలను లెక్కలు వేసుకుని పధకం ప్రకారం నడిపించిన దొంగ నాటకం!ఆజాదో డిగ్గీ రాజానో ఒకసారి మాకూ ఇష్టం లేదు పైనుంచి వచ్చిన ఒత్తిడి కారణం అని చెప్పాడు,వాళ్లకి పైన ఉన్నది యెవరు?సోనియా గాంధీ!కాంగ్రెసువాళ్లే లీక్ చేసినట్టు మొదట చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణా బృందాన్ని పెరేడ్ పెట్టించి రగడ చేసిన వయ్యస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక తనే వ్యతిరేకించినా సోనియా మాత్రం తెలంగాణ ఇవ్వాల్సిందేనని మొండిపట్టు పట్టటం వెనక ఉన్న మతలబు ఏమిటి?తనకేమీ తెలియకపోయినా రాష్ట్రానికి సంబంధించిన చాలామంది సీనియర్ నాయకులు వద్దంటున్నా ఆంధ్రాని విడగొట్టి తీరాల్సిందే అన్న పంతం సోనియాకి ఎందుకు వచ్చింది?

          అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకన్నట్టు చరిత్రని వెనక్కి తిప్పాలని నేను అనుకోవడం లేదు,కానీ ఇవ్వాళ్టి పరిస్థితి కూడా అదే అన్యాయాన్ని కొనసాగిస్తున్నది కదా!"తల్లిని చంపి పిల్లని పుట్టించారు" అని డయలాగులు దంచిన మోదీ ఆంధ్రాకి చేసిన మేలు ఏంటి?ఒక కుండెడు నీళ్ళూ,పది గుప్పిళ్ల మట్టీ తప్ప ఏమిచ్చాడు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి భాజపా ప్రభుత్వం చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని ప్రతి ఒక్కరికీ తెలుసు!

          అయినా మాకు న్యాయంగా రావలసిన పది రూపాయలూ మాకివ్వవయ్యా అంటే ఆ పదీ అడక్కపోతే నీకు ఇరవై ఇస్తాననడం ఛండాలంగా లేదూ!ఆ పది ఇచ్చినా ఈ రవై ఇచ్చినా మోదీ తన జేబు నుంచి తీసి చంద్రబాబుకి ఇస్తున్నాడా?రాష్ట్రం విడిపోయి నాలుగేళ్ళు అయ్యింది,ఇంకో యేడాదిలో ఎన్నికలు కూడా వస్తున్నాయి - ఇంతవరకు హోదాకి బదులు ఇస్తానన్న ప్యాకేజికి సంబంధించిన చట్టబద్ధమైన ప్రకటన కూడా లేదు,ఆంధ్రావాళ్ళు చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చున్నారని అనుకుంటున్నారా బీజేపీ వాళ్ళు!

          రెండు ఉప ఎన్నికలు గెలిచేసరికి టీడీపీ వాళ్ళు కూడా కలల్లో తేలిపోతున్నారు గానీ రేపటి ఎన్నికల ప్రచారంలో మేము ఇది సాధించాం అని చెప్పుకోవడానికి ఏమి ఉంది టీడీపీ వాళ్ళకి?కాంగ్రెసువాళ్ళు అంటున్నారని కాదు గానీ పట్టిసీమకి మీరు పంపులు బిగించి నీళ్ళు వదలడమే కదా చేసింది, ఆ నీళ్ళు పారుతున్న కాలువలు మీరు తవ్వారా?లేదే, అవి అప్పటికే తవ్వి ఉన్నాయి!పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాని బాధ్యత కేంద్రానిది కదా, మరి కేంద్రప్రభుత్వం తన బాధ్యతని నెరవేరుస్తున్నదా?మొత్తం రాష్త్రప్రభుత్వం హడావిడి తప్ప కేంద్రం తన వంతు ఏమి చేస్తున్నదో ఎవరికీ తెలియడం లేదు. విభజన ద్వారా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రప్రభుత్వమే ఇవన్నీ తలకెత్తుకుంటే తట్టుకోవడం కష్టం కాదా?ఎక్కడ కధ అడ్డం తిరిగినా నష్టం ప్రజలకే కదా - చంద్రబాబుకేం నాలుగు తిట్లు తిని ఇంట్లో కూర్చుంటాడు, సంపాదించి దాచుకున్నది అనుభవిస్తూ!

          రాజ్యసభలో కేవీపీ లెక్కలు అడిగినప్పుడల్లా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని ఏడవటం దేనికి?లెక్కలు అడగటంలో అన్యాయం ఏముంది?బీజేపీకీ టీడీపీకి లాలూచీ ఉందనే నిజం బయటపడుతుందని గాకపోతే ఆ తడబాటు దేనికి వస్తున్నట్టు?అంత పెద్ద రాజధాని కడతానన్న పెద్దమనిషి తనకి క్లారిటీ లేకనా రాజమౌళిని పిలుస్తున్నాడు అమరావతి ప్లానుకి!కాంట్రాక్టు ఇచ్చింది ప్రపంచస్థాయి కంపెనీకి అని గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ ఒక సినిమా డైరెక్టర్ని రంగంలోకి దించడం ఏంటి?ఎన్నికల నాటికి పట్టిసీమ గురించి గానీ పోలవరం గురించి గానీ అమరావతి గురించి గానీ కాక ప్రజలు ప్రత్యేకహోదా గురించి అడిగితే జవాబు ఉందా?కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా హోదా కానీ ప్యాకేజీ కానీ దేనికి సంబంధించీ గట్టి ప్రకటన కూడా చేయించలేని అసమర్ధతకి కారణం ఏమిటి?

          బీజేపీ ఇప్పటివరకు వచ్చిన,వస్తున్న గెలుపులతో పట్టిన తలపొగరుని వదులుకుని కళ్ళు తెరిచి చూడడం మంచిది - దక్షిణాదిలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది.ఇన్నాళ్ళూ తమిళనాడులోనే కనిపించిన పరిస్థితి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది!"మోదీ గనక తమిళనాడు వస్తే రాజీవ్ గాంధీకి పట్టిన గతి పడుతుంది!" - ఇది తమిళనాడులో ద్రవిడ పార్టీల వల్ల ప్రభావితం అవుతున్న సామాన్యజనంలో వినబడుతున్న మాటలు, చావును కూడా కోరుకుంటున్నారు!కర్నాటకలో లింగాయత ఉద్యమాన్ని ఎత్తుకున్నది కూడా భాజపా కపటహిందూత్వరాజకీయాల వల్లనే.తమిళనాడులో రాజకీయ అరంగేట్రానికి కదులుతున్న కమలహాసన్ భాజపాయేతర పక్షాలతొనే సమాలోచనలు చెయ్యడం కూడా అనుకోకుండా జరుగుతున్నది కాదు,దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భాజపా వచ్చే ఎన్నికల్లో మట్టి గరవటం ఖాయం - దక్షిణాదిలో ఇంత తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుని కేవలం ఉత్తరాది మీదనే ఆధారపడి అద్భుతాలు సాధించడం అసంభవం!

          వీరందరూ భాజపాకి పెట్టిన పేరు "ఉత్తరాది పార్టీ" అని,సమస్య మూలం ఎక్కడ ఉన్నా ఎవరు దానికి కారణమైనా దానిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కాంగ్రెసుకి రాని "ఉత్తరాది పార్టీ" పేరు తనకెందుకు వచ్చిందో దానినెట్లా పోగొట్టుకోవాలో భాజపాయే ఆలోచించుకోవాలి. ఇంక అసలు ఉత్తరాది వ్యతిరేకత తమిళనాడు నుంచే వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూలానికి వెళదాం.

          మిగతావాళ్ళు ఈ భూమిని ఆక్రమించకపోవటానికి కారణం గురించి చాలాకాలం నుంచీ వెతుకుతున్నాను.ఈ మధ్యనే కొంత స్పష్టత వచ్చింది.అసలు ఈ ప్రాంతం గురించీ ఈ రాజుల గురించీ ఏమీ తెలియదా అంటే అదీ లేదు,పురాణాలలో వీరి ప్రసక్తి చాలాచోట్ల వస్తుంది.చరిత్రలో చూస్తే కౌటిల్యుడు మణులు,రత్నాలు వంటి విలువైన సరుకుల ప్రసిద్ధిని గురించీ రవాణా సౌకర్యాలు బాగుండటం వల్ల కాబోలు రాకపోకలు సులువుగా ఉండటం గురించీ ప్రస్తావించాడు.ఒక ప్రాంతంతో వ్యాపార సంబంధాలు బాగుంటే,ఆ ప్రాంతం మీద యుద్ధానికి తెలివైన రాజు ఎవడూ వెళ్ళడు! అశోకుడు తన శిలాశాసనాలలో కూడా పాండ్య, చేర, చోళ రాజ్యాలను తన పొరుగు రాజ్యాలుగా చెప్పుకుని ప్రశంసించాడు.అన్ని చోట్లా మర్యాదాపూర్వకమైన ప్రశంసలను బట్టి చూస్తే వారితో యుద్ధం చెయ్యడానికి తగిన కారణం లేకపోవడమే వీరి రాజ్యాల్ని సుస్థిరం చేసింది.

          మన దేశంలోని రాజుల్లో యుద్ధోన్మాదులు చాలా తక్కువ,యుద్ధం అనగానే మనకి సినిమాలో చూపించే కొమ్ముబూరలూ, ఏనుగులూ, గుర్రాలే కనిపిస్తాయి.చూడ్డం మనకి సరదాగానే ఉంటుంది, కానీ వాటిని పోషించటానికి ఎంత ఖర్చవుతుందో ఆలోచించండి. ఇవన్నీ రేపు యుద్ధం అంటే ఇవ్వాళ సమకూర్చుకునేవి కావు,ఏ యుద్ధమూ రాకపోయినా రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు సైన్యం ఎప్పుడూ యుద్ధానికి సర్వసన్నధం కావలసిందే!అందువల్ల ప్రయోజనం లేకుండా కేవలం వ్యాపించడానికి ఎవరూ యుద్ధాలు చేసేవాళ్ళు కాదు.సైన్యాన్ని పోషించడానికైనా రాజ్యం సంపదని కూడబెట్టాలి.అది ప్రజల ఆదరణ పూర్వకమైన విధేయత వల్లనే జరుగుతుంది.పీడిస్తే ప్రజలు తిరగబడతారు.వీటిని పరిష్కరించడానికే రాజనీతి అనేది ఏర్పడింది.అందరు రాజులూ ఒకే రకం రాజనీతిని పాటించడం వలన రాజులు మారినా ప్రజలకి తేదా తెలిసేది కాదు,రాజు మారినప్పుడల్లా భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు గాబట్టి ప్రాంతం మీద ప్రజలకి "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి!" అనుకునేటంత మమకారం ఏర్పడింది.క్రైస్తవ సామ్రాజ్యవాదులు బద్దలు కొట్టడానికి ముందు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎన్నెన్నో రాజ్యాలలో ఉన్నప్పటికీ ప్రజలు కలిసిపోవడానికి వీరందరూ ఒకే సంస్కృతికి చెందినవారు కావడమే కారణం!

          ఈ తమిళసీమలోని రాజులు మర్యాదస్తులే గానీ వీళ్ల ఆస్థాన కవులు మాత్రం ఇప్పటి తమిళజాత్యహంకారులకి పనికొచ్చే కాకమ్మ కబుర్లు చాలా చెప్పారు - మా రాజు జైత్రయాత్రలో హిమాలయాల వరకూ వెళ్ళి జెండా పాతి వచ్చాడని చెప్పుకున్నారు,విస్తీర్ణంలో భారతదేశం కన్న పెద్దదైన కుమారీఖండాన్ని పరిపాలించారని కూడా చెప్పుకున్నారు!హిమాలయాల్లో జెండాలు కనబడ్డం లేదేమిటని అడిగితే ఉత్తరాది వాళ్ల అధిపత్యపు కుట్ర మీద తోసేస్తారు,కుమారీఖండం కనబడ్డం లేదేమిటని అడిగితే సునామీ వొచ్చి కొట్టుకుపోయిందని చెబుతారు - రంకు నేర్చిన జాణ బొంకు నేర్వదా!

          హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం నుంచీ పాండ్యులు తమిళనాడును పరిపాలిస్తున్నారని తెలుస్తుంది.భారతదేశానికి దిగువన ఉన్న హిందూ మహాసముద్రంలో అటు ఆస్ట్రేలియాను ఇటు ఆఫ్రికాను కలుపుతూ కుమారీఖండం ఉండేదని పురాణేతిహాసాలు చెబుతున్న మాట వాస్తవమే!పాండ్యరాజుకు ఎనిమిది మంది కుమారులూ ఒక కుమార్తె ఉన్నట్టు,మిగిలిన సామ్రాజ్యాన్ని కుమారులకు పంచి ఈ భాగాన్ని మాత్రం తన ముద్దుల కుమార్తెకు ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి,ఆమె పేరుతోనే కుమారీఖండం అని పిలిచి ఉండవచ్చును.తొలిసారి ఈ కుమారీఖండం యొక్క ప్రస్తావన క్రీ.శ 1350-క్రీ.శ 1420 మధ్యన జీవించిన శివచారియర్ రచించిన స్కందపురాణంలో కనిపిస్తుంది.క్రీ.శ 1864లో Philip Sclater అనే ఇంగ్లీష్ జూవాలజిస్ట్ ఈ కుమారీఖండం గురించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రస్తావించాడు.
          "Lemur" అనే రకం జంతువు ఒక్క మడగాస్కర్ ప్రాంతంలోనే కనబడి ఓక్కనే ఉన్న ఆఫ్రీఅలో కనిపించకుండా ఇక్కద దక్షిణ భారతంలో కనబడటాన్ని గమనించి బహుశా పురాతన కాలంలో సముద్రంలో ఒక భూఖండం ఉండి ఈ జాతి దక్షిణ భారతంలోకి ప్రవేశించాక మునిగిపోయి ఉండవచ్చునని విశ్లేషించాడు.ఇతను తప్ప మరెవరూ చెప్పడం లేదు, ఇతను కూడా ఆధారాలు చూపించి చెప్పినది కాదు - ఒక వూహ మాత్రమే!continental drift గురించి దాదాపు ప్రపంచంలోని ప్రతి శాస్త్రజ్ఞుడూ పరిశోధనలు చేశాడనే చెప్పాలి,వారెవరికీ కనీసం చిన్నపాటి ఆధారం కూడా దొరకలేదు,పైన మ్యాపులో చూపించిన వైశాల్యం గల భూమి మునిగిపోవడానికి ఎంత పెద్ద సునామీ రావాలి!ఎవడన్నా నేను నమ్ముతున్నానని చెప్తే జనాలు ముఖాన్నే నవ్వేస్తున్న రోమ్యిల్లా డప్పారు లాంటి వాళ్ళు వండి వార్చిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్నే వదలకుండా పట్టుకుని వూరేగుతున్నవాళ్ళు ఇట్లాంటి సిద్ధాంతాలని సాక్ష్యానికి తెచ్చుకోవడంలో ఆశ్చర్యం  ఏముంది?

          అసలు క్యామిడీ ఏంటంటే వీళ్ళంతా "కుమారీఖండం" అని దేని గురించైతే ఇంత ఆత్మీయతని ప్రదర్శిస్తున్నారో ఆ మాటలోని "క","ఖ" అనే అక్షరాలు వాళ్ళ వర్ణమాలలో లేవు!కొన్ని చోట్ల ఇంగ్లీషు స్పెల్లింగే "kumaareekaandam" అని ఉంటుంది,మరి చదివేటప్పుడు గుర్తుపట్టటం ఎట్లాగయ్యా అని ఒక వ్యక్తి సందేహపడితే అది మా మేధస్సుకి చిహ్నం,మొత్తం పదాన్ని బట్టి తెలిసేసుకుంటాం,అభివృధి చెందిన భాషలకి అన్ని అక్షరాలు ఉండనక్కరలేదు అని ఒక తమిళజాత్యహంకారి గర్వంగా చెప్పుకున్నాడు.ఏం చేస్తాం,ఎదురు చెబితే తంతాడేమో అనిపించేవాడి దగ్గిర నోరు మూసుకోవడమే ఉత్తమం కదా!అలా అడిగిన వ్యక్తి తమిళుడే కాబట్టి సరిపోయింది జవాబన్నా చెప్పాడు,మనబోటివాళ్లం అడిగితే మా భాషనీ మా సంస్కృతినీ,మా ప్రాంతాన్నీ అవమానిస్తున్నావు అని కోతుల్లా మీదపడి కరిచేస్తారు!

          "I will give you a dozen of proofs. But in order to realise it , you should know Sanskrit and Tamil together because then only you will be able to spot the similarities." అంటూ ఎవరయినా
Manishan (man) is from Manushyaha
Mayakkam – Mayak- Maya (Ilusion)
Arasu – Arasa – Rasa -Raja -Raj (King)
Pagalan -Pagalavan -Bagavan – Bhagvan (God)
Mann – Mani – Manu – Manush (Human)
Ma – Maha (Great)
Neer – Theer -Theerth (Water)
Agam -Agham -Aham (Inner)
Theivam -Theiva -Deiva -Deva (God)
Ulagam – Logam -Log – Lok (World)
Chamath(obedient) -Samartha
లాంటి ఉదాహరణలు చూపించినా "Thanks for those words list. Just think about it, why shouldn’t these words migrated to sanscrit from tamil? Just saying. I don’t know, but just because of similar sound, how do you conclude that tamil borrowed it? and not the other way around?" అని అడ్దం తిరిగి వాదిస్తారు - కిందపడ్డా నాచెయ్యి పైనే ఉంది చూడు అనేవాళ్లని ఏమి చెయ్యగలం చెప్పండి!ఇతరులు చెప్పేది తప్పని రుజువులు చూపించమని గద్దించడం,ఇతరులు చూపించిన రుజువుల్ని ఒప్పుకోకపోవడం అనే రెండు పన్లూ సిగ్గుపడకుండా చెయ్యగలుగుతున్నందుకు వీళ్లని మెచ్చుకుని వచ్చెయ్యడమే తప్ప మనం వీళ్ళని మార్చలేం, హేతుబద్ధమైన వాదనతో వీళ్ళని కట్టడి చెయ్యలేనందుకు మనం సిగ్గుపడనక్కర లేదు!

          తమిళజాత్యహంకారులు I am not saying any language is inferior. All languages are great in their own aspect, I just want to make sure that my mother tongue is given a fair chance… అని వినయం కలబోసిన సహృదయతను నటిస్తూనే Sanscrit does not fill in any criteria of a linguistic “Living” language. linguistic def: Living language is any human language that is currently in use by humans for their day-to-day activities. అని సంస్కృతం మీద తిరస్కారాన్ని ప్రదర్శిస్తూ The oldest living language by linguistic definition is Tamil. You cannot refute that. అనేరకం అహంభావాన్ని ప్రడర్శించగలరు.It is shocking to know that Only in Tamil Nadu, the concept of separating N.India and S.India is spoken - why? అని ఒక వ్యక్తి సూటిగా అడిగితే కొంచెం కూడా కంగారు పడకుండా "We are separating because we are afraid. Yes, afraid of loosing our identity. You yourself ignored every single mistake you made and insist on your claim. We believe we are being forced to accept a language which is alien to us. I hope you know that India does not have a national language and all the background info about that. How much harder we have to suffer to get it right. Do you have any idea how many times i have been asked by my friends and colleges, “Are you an Indian?” for not knowing Hindi. What is the relationship between being an Indian and knowing hindi?" అని ధీమాగా చెబుతున్నారంటే వాళ్ళెంత ముదిరిపోయారో ఆలోచించండి!పైన "Do you have any idea how many death treats professors received to publish a paper stating that Harappa &Mohenjodaro civilization scripts resemble Tamil?(ref 1, 2) Why is this done? Tell me. (BTW not Sanskrit, but Tamil.) అంటూ సెంటిమెంటు రగిలించే కట్టుకధల్ని వినిపిస్తున్నారు.ఒకవైపున అగస్త్యుడు తమిళ భాషకి వ్యాకరణం ఏర్పరచిన తర్వాతనే ఆ భాష వృద్ధిలోకి వచ్చింది అనేది వాళ్ళ ప్రాచీన సాహిత్యంలోనే ఉంచుకుని కూడా సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందనడం I am the father of my grand father అనడం లాంటి చెత్త వాదన కాదా!తాము చెప్తున్నవి అబద్ధాలని తెలిసి కూడా పదే పదే చెబుతూ అవి అబద్ధాలని నిరూపించే ఆధారాలు చూపించినా "మీవే తప్పుడు ఆధారాలు!నేను చూపించినవే గట్టి సాక్ష్యాలు!!మీరు తమిళ సంస్కృతిని అవమానించడానికే ఇట్లా చేస్తున్నారు!!!" అని రెచ్చిపోయేవాళ్లని తన్నక ఏం చెయ్యాలి?

          నిజానికి ద్రవిడ పార్టీలు తమిళనాట తమ అధికారాన్ని పదిలం చేసుకోవటానికి ఇక్కడ ఒకప్పుడు pre-vaidik tamil culture ఉండేదని చెబుతూ వీదేశీయులైన ఇంగ్లీషువాళ్ళూ స్వదేశీయులైన కమ్యునిష్టోళ్ళూ తమ స్వార్ధప్రయోజనాల కోసం ప్రతిపాదించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని వాళ్ళు వదిలేశాక కూడా భుజాన మోస్తూ తమిళ ప్రజల్ని తమచేత మాత్రమే పొదగబడే కోడిపిల్లల్లా తయారు చెయ్యటానికి ప్రయత్నాలు మొదలుపెట్టకముందరి కాలంలో తమిళ ప్రజలు సనాతన ధర్మలోనే ఉండి ఆళ్వారులూ నయనారుల ద్వారా సనాతన ధర్మానికి అంతకు ముందరి రూపం కన్న విభిన్నమైన రూపాన్ని ఇచ్చి ఆ జీవధార ఇంకిపోకుండా చేశారు - వారి కీర్తి కూడా అనుపమానమైనదే!అంతకు ముందు ధార్మిక సాహిత్యం పండితుల వద్దనే పోగుపడి ఉండేది,సామాన్యులకి ఏమీ తెలిసేది కాదు - దేవుని పట్ల విధేయతని పెంచిన భక్తి ఉద్యమం,సామాజిక అసమానతల పట్ల తిరస్కారం అనె రెండు రెక్కల్ని దాల్చి ఎగిరిన వైనతేయుల వలె ఆళ్వారులు,నయనారులు సంక్లిష్టమైన సనాతన ధర్మాన్ని సరళతరం చేసి దేశం మూలమూలలకీ హిందూధర్మం వ్యాపించడానికి కారణమయ్యారు.తమ భాషకు ప్రత్యేకతని సంతరించిపెట్టాయని వీరు గొప్ప భావావేశంతో చెప్పుకునే సంగం సాహితీకూటములలో ఉత్సాహంగా పాల్గొన్నది నాటి వైదిక బ్రాహ్మణులూ హిందూ ధర్మానికి కట్టుబడిన రాజప్రముఖులూనూ,అక్కడే వీళ్ళ అసత్యాలు తెలిసిపోవడం లేదా?

          ఇవ్వాళ మనం చదువుతున్న చరిత్ర సమస్తం మొదట ఇంగ్లీషువాళ్లతో వాళ్ళ అవసరాల కోసం కూర్చబడినది.వాడిన పద్ధతులు శాస్త్రీయమైనవి గాబట్టి దొరికిన ఆధారాలు మన దేశపు ప్రాచీనుల అత్యున్నతమైన నాగరికతని బయటపెట్టినా వాటిని విశ్లేషించడంలో తప్పుడు పద్ధతుల్ని పాటించారు.జీవం లేనివి కాబట్టి వస్తువులు మోసం చేయలేవు గానీ మోసం నేర్చిన మనిషి వాటి చుట్టూ అబద్ధాలు పేర్చాడు - వస్తువుల్నీ విశ్లేషణల్నీ కలిపి చూస్తే వాళ్ళు చెబుతున్నది నిజమేనేమో అనిపిస్తుంది.ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం సాంకేతికంగా గొప్ప విజయాలని సాధించింది గానీ శాస్త్రజ్ఞులలో మాత్రం చాలామంది జాత్యహంకారులూ, మతదురభిమానులూ ఉన్నారనేది మర్చిపోకూడదు!మన దేశపు చరిత్ర రచనలోనూ చాలా అవకతవకలు ఉన్నాయి.వీటికి కారణం ఆయా వ్యక్తుల రాగద్వెషాలే తప్ప అనుకోకుండా జరిగినవి కావు - అనుకోకుండా జరిగితే వాటికి అసలు శాస్త్రీయత ఉంటుందా?vincent Smith పేరు మీరు వినే ఉంటారు,ప్రముఖ చరిత్రకారుడే,ఆయన OxforD వాళ్లకోసం రాసిన History of India పుస్తకంలో దక్షిణాదికి కనీసం ఒక అధ్యామైనా కేటాయించలేదు, కొన్ని పేజీలతో సరిపెట్టేశాడు.స్వతంత్రం వచ్చాక నెహ్రూ గారి శ్రుతిమించిన ప్రోత్సాహంతో విశ్వవిద్యాలయాల్లో పీఠమేసుకుని కూర్చున్న వామపక్ష మేధావులు కూడా వారి దారిలోనే నడిచారు - ఇంగ్లీషు వాళ్ళంటే విదేశెయులు!స్వదేశీయులు వీళ్ళెందుకు మాతృదేశపు చరిత్రని అబద్ధాల్ని పేర్చి మురికి చేశారు?ముస్లినులకి వీరావేశం తెప్పించే ఇస్లామిక్ స్టేట్ లాంటి తమకి నచ్చిన కమ్యూనిస్ట్ స్టేట్ ఇక్కడ స్థాపించాలంటే  ఇస్లాములో చెప్పబడిన "ముస్లిం","కాఫిర్" అనే విభజన లాంటిదే ఐన "కమ్యూనిస్ట్","నాన్-కమ్యూనిస్ట్" అనే విభజన ప్రకారం తాము వక్రీకరిస్తున్నది "నాన్-కమ్యూనిస్ట్" వర్గానికి చెందిన హిందువుల చరిత్ర కాబట్టి వాళ్లకి సిగ్గు,లజ్జ,భయం లాంటివి కలగలేదు!

          During the year 1969–70 the Central Government under Mrs. Indira Gandhi established a committee under the chairmanship of G. Parthasarathy, a diplomat close to Nehru-Gandhi family. Its task was to integrate the nation through education. At that time I was a reader in Educational Philosophy at NCERT and was selected as one of the five members of the committee. In our first meeting Mr. Parthasarathy, as chairman of the committee explained the purpose of our committee in typically diplomatic language: “It is our duty not to sow the seeds of thorns in the minds of the growing children which will grow up as barriers to national integration. Such thorns are found mostly in the history courses. Occasionally we can find them in language and social science courses also. We have to weed them out. We have to include only such thoughts that go towards inculcating the concept of national integration firmly in the minds of our children. This committee carries this great responsibility.”
          The other four members were nodding respectfully. But I said, “Sir, I am unable to understand your words. Will you please explain with a few illustrations?” The Chairman responded: “Ghazni Mohammed looted the Somnath Temple, Aurangzeb built mosques by demolishing the temples in Kashi and Mathura, he collected jizya—is it possible to build a strong India under the present circumstances by conveying such useless facts? What purpose do they serve, other than generating hatred?”
          “But are they not historical truths?” I persisted.
          “Plenty of truths are there. Using these truths judiciously is the wise way to teach history,” he retorted. The remaining four members simply nodded their heads saying “Yes, yes.” But I was not prepared to let him off.
          “You yourself gave examples of Kashi and Mathura. Even today, lakhs of pilgrims from all corners of the country visit these places every year. They can see for themselves the huge mosques built using the walls, pillars and columns that once belonged to demolished temples. They can also see a recently built cow shed like shack in a corner, behind the mosque, that serves as their temple. All these pilgrims are distressed to witness such awful structures. They describe the plight of their temples to their relatives after they return home. Can this create national integration? You can hide such history in the school texts. But can we hide such facts when these children go on excursions and see the truth for themselves? Researchers have listed more than thirty thousand such ruined temples in India. Can we hide them all?…”
          Mr. Parthasarthy interrupted me and asked: “You are a professor of philosophy. Can you please tell us what is the purpose of history?”
          “Nobody can define the purpose of history. We do not know how the things will shape up because of the development of science and technology in the future. Some western thinkers might call it the philosophy of history. But such thoughts are futile. Our discussion here should be—what is the purpose of teaching history? History is seeking out the truths about our past events, learning about ancient human lives by studying the inscriptions, records, literary works, relics, artefacts etc. We should learn also not to commit the same blunders that our predecessors committed. We have to imbibe the noble qualities that they adopted; historical truths help us to learn all these things.”
          “What if this search for truth hurts the feelings of the minority? Can we divide society? Can we sow the seeds of poison?” He tried to stop me with these questions.
          “Sir, the categorisation on the lines of majority and minority would itself be dividing the society, or at least a step towards dividing the society. This idea of ‘seeds of poison’ is prejudiced. Why should the minority think of Gazni Mohammed and Aurangzeb as their own people and heroes? Mughal kingdom was destroyed by the religious bigotry of Aurangzeb. It was at its height in Akbar’s time because his policy of tolerance led to religious and social harmony. Can’t we teach such lessons to children without offending the historical truths? Before teaching the lessons to be learnt from the history, should we not explain the historical truths? This idea of hiding true history is driven politics. This trend will not last long. Whether they are minority or majority, if the education does not impart the character to face the truth with emotional maturity, such education is meaningless and also dangerous.” I replied.
          Parthasarathy agreed. He said he appreciated my scholarship and the ability to think clearly. During the lunch break he called me aside, indicated his closeness to me by placing his hand on my shoulders. He then said with a winning smile: “What you say is correct academically. You go and write an article about what you said. But when the government formulates a policy covering the whole nation, it has to consider the interests of all the people. Intellectually pure principles do not serve any purpose.”
          Next day when we met, I stuck to my stand. I argued that history that is not based on truth is futile and dangerous. I did not budge even when Parthasarathy showed his irritation on his face. The morning session closed without arriving at any conclusion. Parthasarathy did not speak to me again. We met again after a fortnight. The committee had been re-structured, without me. In my place was a lecturer in history by name Arjun Dev known for his leftist leanings. The revised text books of science and social studies published by NCERT and the new lessons that were introduced in these texts were written under his guidance. These are the books which were prescribed as texts in the Congress and Communist ruled states or they guided the text-book writers in these States.
          ఇది Santeshivara Lingannaiah Bhyrappa అనే కన్నడ మేధావి యొక్క స్వానుభవం!అక్బర్ గురుంచి గొప్పగా చెబితే సరిపోతుంది గదా, కావాలని దుర్మార్గుడైన ఔరంగజేబుని సన్మార్గుడని అబద్ధాలు చెప్పడం దేనికని మంచిమాట చెప్పినా ఒళ్ళు కొవ్వెక్కి తలకి యెక్కించుకోకుండా దుర్మార్గులైన ముస్లిముల్ని సన్మార్గులుగానూ సన్మార్గులైన హిందువుల్ని దుర్మార్గులుగానూ చిత్రీకరించటానికి సిగ్గు లేకుండా ఎగబడినవాళ్ళు ఇవ్వాళ వాటిని సరిచేస్తుంటే చరిత్రని కాషాయీకరిస్తున్నారని అరుస్తున్నారు, ఎంత సిగ్గులేని మంద?వీళ్ళ అబద్ధాల్ని తలకెక్కించుకుని తమిళులు రెచ్చిపోతున్నారు, ఇవ్వాళ్టికి మేమసలు హిందువులమే కాదనే స్థితికి వచ్చారు, రేపటికి మరోసారి దేశవిభజనకి కూడా తయారవుతారు ఇలాగే వదిలేస్తే!

          ఆర్కియాలజీ పనులకి సంబంధించినంతవరకు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది పట్ల తొలినాళ్ళలో నిర్లక్ష్యం జరిగినప్పటికీ తర్వాత కాలంలో శ్రధ తీసుకుని జరిపించిన త్రవ్వకాల విశ్లేషనలని బట్టి తమిళనాట గ్రామాలు,పట్టణాలు అని చెప్పదగిన జనావాసాల ఆనవాళ్ళు క్రీ.పూ 3వ శతాబ్దం నుంచే కనబడుతున్నాయి - సింధు నాగరికతా కాలానికి 2,500 సంవత్సరాల తర్వాత!ఇంకా పరిశోధన చెయ్యాల్సి ఉంది,పాండ్యుల రాజధాని మధురైని అసలు ముట్టుకోనే లేదు,తొలినాటి చోళులకి సంబంధించ్ఘిన Uraiyurలో 12 త్రవ్వకాల ట్రెంచీలు,పల్లవుల రాజధాని కాంచీపురంలో 17 త్రవ్వకాల ట్రెంచీలు మాత్రమే ఉన్నాయి - వాటి ప్రాధాన్యతని బట్టి చూస్తే ఆ పని చాలా తక్కువ.మిగతాచోట్ల నిర్లక్ష్యం ఒక్కటే కారణం కానీ తమిళనాడులో చారిత్రక పరిశోధన పనులు మందగించటానికి మాత్రం ఇక్కడి రాజకీయ వాతావరణమే ప్రధాన కారణం - అక్కడ బయటపడిన,బయటపడుతున్న విషయాలు తమకు వ్యతిరేకంగా ఉంటున్నాయని తెలిసి అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి.ఇటీవల విద్యాశాఖ మంత్రియే నిండు సభలో "Dravidian civilization is not part of Hinduism and The Dravidian civilization is older than the Aryan" అని ప్రకటించేశాక వీరినుంచి మనం చారిత్రక వాస్తవాలని ఆశించగలమా?తమిళ ప్రజలు ఈ రెండు ద్రవిడ పార్టీల పొదుగుడు పొట్టల కిందనించి బయటికి వచ్చాకనే వారి నిజమైన చరిత్రని తెలుసుకోగలుగుతారు - అంతవరకు తమిళప్రజలు ఈ రెండు చెడగరపు ద్రవిడ పార్టీల పొదుగుడు చీకటి నుంచి బయటకి రాలేరు, తమ సంస్కృతి యొక్క కాంతులు విరజిమ్మే సత్యసౌందర్యాల వెలుగుని చూడలేరు!

          ప్రస్తుతానికి దొరికిన ఆధారాలు తక్కువే అయినా అవి ఖచ్చితమైనవే,స్పష్టత కూడా ఎక్కువే.సాహిత్యరూపాలూ శిలాశాసనాలూ అన్నింటినీ పరిశీలించిన పండితులు సంగం కాలంలో ప్రస్తావించబడిన నగరాల,రాజుల,ప్రముఖుల కాలాన్ని క్రీ,పూ 2,3 శతాబ్దాలుగా నిర్ణయించారు - తమిళ జాత్యహంకారులు కూడా ఒప్పుకున్నారు.ఇప్పటికి దొరికిన అన్ని ఆధారాలనీ కలిపి చూస్తే ఒక వింత విషయం గోచరిస్తున్నది - కనుక్కున్నవాటిలో అత్యంత ప్రాచీన కాలం నాటివైన సామ్రాజ్యాలేమో క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందినవి,నగరాలు మాత్రం ఒక శతాబ్దం తర్వాతవిగా కనబడుతున్నాయి,ఇదెట్లా సాధ్యం!ఇంకా పరిశోధనలు జరిగితే రాజ్యాలు ముందర ఏర్పడి నగరాలు తర్వాత నిర్మించబడటం అనే ముందువెనకల చిక్కుముడి విడిపోవచ్చు - జరగనివ్వాలి కదా!ఈ క్రీ.పూ నాల్గవ శతాబ్ది నుండి క్రీ.పూ 700 వరకు వెళ్ళగానే తమిళ ప్రాంతం బృహత్ శిలాయుగపు నాగరికతలో ఉన్నట్టు తెలుస్తున్నది,ఈ కాలంలో అసలు పెద్దవే కాదు చిన్న నగరాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు.ఎంత వెనక్కి వెళ్ళి చూసినా తమిళ జాత్యహంకారులు చెబుతున్న "ఉత్తరాది నుంచి వచ్చిన ఆర్యులు రుద్దిన పరాధీనతకి ముందరి స్వచ్చమైన తమిళ సంస్కృతి" అనేది కంచుకాగడా పెట్టి వెతికినా కనపడటం లేదు!

          "Culturally, the megalithic people of the South shared many beliefs and practices with megalithic builders elsewhere in the subcontinent and beyond. Yet certain practices and artefacts were at least compatible with the Vedic world and may well have prepared for a ready acceptance of Vedic concepts a natural assimilative process still observable in what has been called the 'Hinduization' of tribals" - అనేది నిష్పక్షపాతంగా చరిత్రను రచించే నిబద్ధత ఉన్న చరిత్రకారులు ఒప్పుకుంటున్న సత్యం,ఇంగ్లీషువాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం కల్పించితే కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ వాళ్ళ ఎజెండా కోసం ఒప్పుకుంటే ద్రవిడ అస్తిత్వం ముసుగు కోసం వీళ్ళు మోస్తున్న ఆర్యుల అధిపత్యపు దాడి/ఉత్తరాది సాంస్కృతిక దోపిడీ అనే మాటలతో వర్ణించటానికి పనికొచ్చే భీబత్సం యొక్క ఆనవాళ్ళు మాత్రం ఇకముందు కూడా దొరకవనేది ఖరాఖండిగా చెప్పొచ్చు!

          కేవలం సాహిత్యపు ఆధారాలు చూపిస్తే వాళ్ళు పిట్టకధలని కొట్టిపారేస్తారు గాబట్టి మొదట చారిత్రక వాస్తవాలని పరిశీలించి తర్వాత వాటితో సాహిత్య విషయాలు ఎలా సరిపోలుతున్నాయో చూస్తే "సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టడం","తమిళ సంస్కృతి వైదిక సంస్కృతి కన్న ప్రాచీనం కావడం","తమిళ భాష సంస్కృత భాషతో సంబంధం లేకుండా సర్వ స్వతంత్రంగా ఎదగడం" వంటివి రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం చెబుతున్న అబద్ధాలని తేలిగ్గానే తెలుసుకోవచ్చు - అబద్ధాలని తెలిసినా సరే నేను ఒప్పుకోను అన్న మొండితనం ఉంటే మాత్రం నేను చెయ్యగలిగంది లేదు!

          బృహత్ శిలాయుగపు త్రవ్వకాలలో దొరికిన వస్తువులలో రాగితో చేసిన సింధు ప్రాంతపు మహామాతను పోలిన విగ్రహాలూ త్రిశూలాల వంటి చిహ్నాలూ దొరికాయి.నేను గతంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శిలాయుగపు సంస్కృతిలోని ముఖ్యమైన విషయంగా పేర్కొన్న మరణించిన ఆత్మీయుల దేహాల్ని సమాధుల రూపంలో భద్రపర్చటం,పితరుల కోసం సమాధులని అలంకరించటం అన్నీ తమిళనాడులోనూ కనబడుతూ ఇక్కడా అదే విధమైన పద్ధతుల్ని అనుసరించినట్టు తెలుస్తున్నది.తర్వాత కాలంలో సకల హిందువులకూ ఆరాధ్యులైన Aiyanar(ధర్మశాస్త),Murugan(కార్తికేయుడు),Korravai(దుర్గ) వంటి దేవతామూర్తులు తొలినాటి కాలంలో అప్పటి ఆదివాసీల దేవతలై ఉండి సంస్కృతుల సామరస్య పూర్వకమైన మేళవింపు ద్వారా వైదికమతంలోకి ప్రశించినారని చాలామంది ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ మేళవింపుని మేళవింపుగా చూడకుండా ఆర్యఋషులు ద్రవిడ సంస్కృతి మీద చేసిన దాడిగా రూపం మారుస్తున్నారు ద్రవిడ సిద్ధాంతులు,కానీ నిజాయితీ గల చరిత్రకారులు ఎంత పరిశోధించినా ఈ రెండు రకాల ప్రజల మధ్య ఘర్షణకూ ఆర్యఋషుల ఆక్రమణకూ ద్రవిడ జాతుల పరాధీనతకూ సాక్ష్యాలు కనబడటం లేదు - సాక్ష్యాలు లేనప్పటికీ ఈ ద్వేష సిద్ధాంతులు వారి వాదనని వదులుకోవటం లేదు.ఒక ప్రశ్నకి జవాబు చెబితే మరొక ప్రశ్న వేస్తూ మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పకుండా ఆ ప్రశ్మలో తమిళ సంస్కృతిని అవమానించే ధోరణి ఉందంటూ అక్కణ్ణుంచి తప్పుకుపోవడమో రెచ్చిపోయి తన్నడమో చేస్తూ ఉంటారు.

          ఒక్కోసారి తమిళజాతి ఔన్నత్యాన్ని ఉగ్గడిస్తూ తమిళజాత్యహంకారులు వండివారుస్తున్న స్వకపోలకల్పితకధనాలు చదువుతుంటే ఆ కట్టుకధల్ని పేనడానికి వాళ్ళు ఎంత సమయం వృధా చేసి ఉంటారో అని ఆలోచిస్తే జాలి వేస్తుంది - వీటిని నమ్ముతున్న అమాయకుల మీద మరీనూ!శివాజీ గనేశన్ చాలా గొప్ప నటుడు,అందులో ఎటువంటి సందేహమూ లేదు - కానీ శివాజీ గణేశన్ సినిమాని టీవీలో వీక్షిస్తున్న ఒక హాలీవుడ్ నటుడు ఇతని నటనా ప్రతిభకి ఈర్ష్యపడి టీవీని బద్దలు గొట్టేశాడన్న కధనం చదువుతుంటే ఇలాంటి కధనం రాయడానికి కనీసపు సిగ్గు కూడా పదలేదా రచయిత అని ఆశ్చర్యం వేసింది!ఈ మధ్యకాలంలో ఫిలిం ఫెస్టివల్స్ హడావిడి పెరిగాక కూడా హాలీవుడ్ వాళ్ళకి అసలు భారతీయ సినిమా గురించి తెలిసింది చాలా తక్కువ, అలాంటిది ఆనాటి శివాజీ గణేశన్ గురించి వాళ్లకి తెలియడమూ ఇతని మీద వాళ్ళు ఈర్ష్యపడటమూ నిజంగా జరిగి ఉంటుందా?అది జరగలేదని రచయితకి కూడా తెలుసు గనకనే ఆ టీవీని పగలగొట్టిన నటుడి పేరు ఇవ్వకుండా "ఒక హాలీవుడ్ నటుడు" అని చెప్పి కధనానికి చివర "ట!" తగిలించాడు - అయినా సరే ఇటువంటి వార్తాకధనాలు ఇకముందు కూడా ఎక్కడో ఒకచోట కనబడుతూనే ఉంటాయి,తమిళజాతీయవాదుల్ని పులకింపజేస్తూనే ఉంటాయి.

          తమిళ నాయకుల్లో అబద్ధాలు చెప్పి ప్రజాభిమానం సంపాదించుకోవటం పెరియార్ కాలం నుంచి మొదలైంది.పెరియార్ జీవితచరిత్రలో వర్ణించబడిన ఒక సన్నివేశం:పెరియార్ ఒకసారి కాశీ వెళ్ళాడట,ఆకలితో నకనకలాడుతూ బ్రాహ్మణుల వసతికి వెళ్ళి అతి దీనంగా అర్ధించాడట,వాళ్ళు ఇతన్ని కసిరికొట్టి బయటికి గెంటివేశారట,దానితో పెరియార్ బ్రాహ్మనాధిక్యత మీద పోరాడాలని నిశ్చయించుకున్నాడట - పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్ అప్పటి కాలంలో అత్యంత ధనవంతుడని తెలియనివాళ్ళు మాత్రమే ఈ కధని నిజమని నమ్మగలరు!ఏ కాస్త ధనవంతులైనా అప్పట్లో పొరుగూరు వెళ్ళాలంటే పెద్ద పెద్ద ట్రంకుపెట్టెల నిండా బట్టలూ సామగ్రీ పెట్టుకుని వీటిని మొయ్యటానికి పనివాళ్లను కూడా తమవెంట తీసుకుని వెళ్ళేవాళ్ళు - అట్లాంటిది సంఘంలో గౌరవమర్యాదలు గల ఒక ధనవంతుడు తిండి కోసం బ్రాహ్మణుల వసతుల దగ్గిర కెళ్ళి అడుక్కోవడం లాంటి నీచమయిన పని చెయ్యడం సంభవమా!అది జరిగిన సన్నివేశం కాకపోతే దానిని కల్పించినది ఎవరు?పెరియార్ మనస్సులో బ్రాహ్మణ వ్యతిరేకత పుట్టడానికి కారణాలను చెబుతున్న అతని అనుచరులు రాసినదే తప్ప ఆ కధనం అతని శత్రువులు కల్పించినది కాదే!పెరియార్ మొదలుకొని ఇప్పటికీ తమిళనాడును పిల్లలకోళ్ళ మాదిరి పొదుగుతున్న రెండు ద్రవిడ పార్టీల మూలస్తంభాలకూ అబద్ధాలతో గొప్పదనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి?

          పెరియార్ మొదలుకొని ద్రవిడ సిద్ధాంతులకీ పైన భైరప్ప గారు పేర్లతో సహా చెప్పిన మేధావులకీ పాకిస్తాన్ ఆవిర్భవానికి కారణమైన ద్విజాతి సిద్ధాంతులకీ ఆ సిద్ధాంతాలని పేనడానికి వెనక ఉన్న అసలు కారణం తమ ప్రాంతపు భూమి మీదా ఆ భూమినుంచి తవ్వి తియ్యగలిగిన సంపద మీదా అధికారం తమ చేతినుంచి జారిపోకుండా పట్టి ఉంచుకోవడం - దాని కోసమే ఆ మూడు రకాల వ్యక్తులూ ఒకే రకమైన  వ్యూహం అనుసరించారు.కాంగ్రెసువారు ఔరంగజేబును మంచివాడిగా చూపించకపోయినా వారి సొంత ఓట్లు వారికి పడతాయి,చదువూ సంధ్యా లేని బీద ముస్లిములకి అసలు ఔరంగజేబు ఎవరో తెలిసే అవకాశమే లేదు - ఆ డిమాండు ముస్లిం లీగ్ వంటి మోతుబరి ముస్లిం రాజకీయ నాయకుల నుంచి వచ్చింది కాబట్టి చేశారు,చెయ్యకపోతే కాశిం రజ్వీ పెట్టిన పార్టీకి చెందిన వాళ్ళ లాంటి మోతుబరులు వీళ్ళకి సపోర్టు ఇవ్వరు!భూస్వామ్య ముస్లిములు ద్విజాతి సిద్ధాంతం పేరు చెప్పి పాకిస్తాన్ విడగొట్టుకోగలిగితే భూస్వామ్య తమిళులు ద్రవిడ సిద్ధాంతం సాయంతో దేశం నుంచి విడిపోకపోయినా తమిళజాత్యహంకారపు బెదిరింపు రాజకీయాలతో నెట్టుకొస్తున్నారు.ఈ రెండు వర్గాలూ మొదటినుంచీ ఇంగ్లీషువాళ్లతో అంటకాగి బలిసినవి, అప్పటివరకు స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండునని కోరుకుని పోరాటానికి దూరంగా ఉన్న వీళ్ళకి తీరా స్వతంత్రం వచ్చే కాలానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయి కాళ్ళూ చేతులూ ఆడకుండా అయిపోయారు.స్వతంత్రం వచ్చాక ఏర్పడబోయే ప్రభుత్వంలో దాన్ని తెచ్చినవారికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప వ్యతిరేకించి దూరంగా ఉన్న తమకి ఉండదు - కాబట్టి ఒకరు ద్విజాతి సిద్ధాంతాన్నీ ఒకరు ద్రవిడ సిద్ధాంతాన్నీ ఎత్తుకున్నారు - ఆఖరి నిమిషాల్లో ఇలాంటి దరిద్రపు ఉపాయాలతో ప్రమాదాల్ని తప్పించుకోవడాన్ని మన పెద్దవాళ్ళు చావుతెలివి అన్నారు!

          అప్పటికప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం మాత్రమే గొప్ప అనుకుని ఎంత నీచానికైనా పాల్పడి బరితెగించడమే తప్ప ఇవ్వాళ మనం ఈ అబద్ధాలని ప్రచారం చేసి గాలివెధవలకి రాజముద్ర కొడితే రేపటి తరం మళ్ళీ పరాధీనతకి గురవుతుందనే దూరదృష్టి లేని కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ వీళ్ళని హిందూమతాన్ని బలహీనపర్చడానికి వాడుకున్నారు.కాంగ్రెస్సా బీజేపీయా తెదెపానా తెరాసావా డీఎంకేవా మరో పార్టీయా అనే ఫికరు లేకుండా అధికారంలోకి రావడానికి ప్రజల ముందు నిలబడి అబద్ధాలు చెప్పిన ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం నిజాయితీగా పనిచెయ్యదనేది నూటికి నూరుపాళ్ళు నిజం!తమిళప్రజలు వీళ్ళు మన సంస్కృతి గురించే కదా డప్పు కొడుతున్నది అని పులకరిస్తున్నారే గానీ ఆ డప్పుల మోతల సందడిలో వీళ్ళు తమ జేబులకి వేస్తున్న కన్నాల్ని చూసుకోవడం లేదు.

          ఒక భాషకు ఇంత సమగ్రమయిన స్థాయిలో వ్యాకరణం రచించిన వ్యక్తి మరొకరు లేరని ప్రపంచంలోని భాషాశాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకుంటున్న సంస్కృతవ్యాకరణకర్త పాణిని క్రీ.పూ 6వ శతాబ్దం వాడు!అగస్త్యుడు అనే ఒక వ్యక్తి గానీ ఒక పండిత సమూహం గానీ ఉత్తరాది నుంచి వచ్చి తమిళభాషకు వ్యాకరణం ఏర్పరచిన తర్వాత జరిగినవని చెప్తున్న సంగం సాహితీ గోష్ఠులు క్రీ.పూ 4వ శతాబ్దికి సంబంధించినవి!ఇంక సంస్కృతం తమిళభాష నుంచి పుట్టిందనడం ఎట్లా కుదురుతుంది?

          నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదన్నట్టు నిన్న గాక మొన్న కళు తెరిచిన వీళ్ళు ప్రపంచం లోని అన్ని సంస్కృతులూ మా సంస్కృతి తర్వాతే,మేమే అందరికన్న గొప్పవాళ్లం,వైదిక సంస్కృతి కూడా మమ్మల్ని కాపీ కొట్టినదే అని చెప్పుకుంటున్నారు గానీ వీళ్ళు గొప్పవాళ్ళు అని పొగుడుకుంటున్న ప్రాచీన కాలపు తమిళ సాహితీవేత్తలు వైదిక సంస్కృతిని వీళ్ళలా అవమానించలేదు!సంగం సాహితీ సభల నాటి కవితాసృష్టి ఇప్పుడు దొరకటం లేదు,ఇతర సాహితీ ప్రక్రియలలో వాటి ప్రస్తావనల ద్వారా మాత్రమే వాటి ఆనవాళ్ళు తెలుస్తున్నాయి.క్రీ.శ 2వ శతాబ్దికి చెందిన తొల్కాప్పియం గురించి పరిశోధనలు చేసిన పండితులు అది సంస్కృతం లోని ఐంద్రం అనే వ్యాకరణ పద్ధతిని అనుసరించి రచించిన తమిళ వ్యాకరణం అని చెబుతున్నారు.N. Raghunathan అనే పండితుని అభిప్రాయం ప్రకారం దీనిలో భరతముని విరచితమైన నాట్యశాస్త్రం లోని రసవ్యంజన సిద్ధాంతం ప్రస్ఫుటమై కనిపిస్తున్నది.సంగీతానికీ నృత్యానికీ సంబంధించిన లయాత్మకమైన రసభావం వ్యాకరణంలో ఇమడ్చటం వల్లనే తమిళభాషకు ఆ శ్రావ్యత వచ్చింది కాబోలు!

          ఈ తొల్కాప్పియం తమిళ దేశంలోని వైవాహిక క్రతువు సమస్తం ఆర్యులు నిర్దేశించిన పద్ధతి అని స్పష్టం చేసింది.ఇక్కడ ఆర్యులు అని గౌరవించినది ఉత్తర దేశపు వైదిక సంస్కృతికి చెందినవారినే కదా - మరింత విశేషమైన విషయం యేమిటంటే వైదిక సంస్కృతి వర్ణించిన ఎనిమిది రకాల వివాహలనే తొల్కాప్పియం కూడా అనుసరించింది!బ్రాహ్మన,క్షత్రియ,వైశయ,శూద్రులనే వర్నవ్యవస్థని కూడా తమిళసమాజానికి అనువైనదిగా నిర్దేశించి చివరి పదాన్ని వెళ్ళలనే తమిళ పదంలా మార్చింది.తొల్కాప్పియం తమిళ ప్రాంతాన్ని భూమి యొక్క స్వభావాన్ని బట్టి అయిదు రకాలు చేసి ఒక్కొక్క దానికీ ప్రేమకు సంబంధించిన ఒక అవస్థనీ ఒక దైవాన్నీ అనుసంధానించింది - పర్వతసీమలు ప్రేమలోని  కలయికనీ మురుగన్ అనె దైవాన్నీ, ఎడారులు ప్రేమలోని విరహాన్నీ దుర్గ అనే దైవాన్నీ, అరణ్యాలు ప్రేమలోని ఎదురుచూపునీ కృష్ణుడు అనే దైవాన్నీ, సముద్రతీరాలు ప్రేమలోని దుఃఖాన్నీ వరుణుడు అనే దైవాన్నీ, సారవంతమైన భూములు ప్రేమలోని కలహాన్నీ ఇంద్రుడు అనే దైవాన్నీ సూచిస్తాయట!వీరిలో ఎవరు వైదిక దేవతలో ఎవరు తమిళ దేవతలో చెప్పి విడదియ్యగలగడం సాధ్యమా?అసలు ఇంత అవిభాజ్యమైన సామరస్యం యుద్ధం ద్వారానో కుట్ర ద్వారానో జరిగడం కుదిరే పనేనా?

          తమిళజాత్యహంకారుల మొండివాదనల్ని పట్టించుకోకుండా తమిళ సాహిత్యాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఈ సామరస్యపూర్వకమైన సంగమం సంగం సాహితీ గోష్ఠుల కాలంలో  రెండింతలు మూడింతల వేగంతో జరగడమే వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తున్న అత్యద్భుతమైన తమిళ సంస్కృతి ఏర్పడింది!సంగం కాలపు సాహితీస్రష్టలలో బ్రాహ్మణులు ఉన్నారు, రాజులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, కృషికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు.ఎట్టుత్తొకల్ అని వ్యవహారంలో ఉన్న ఏడు గ్రంధాలు వెలువడ్డాయి.వీటన్నింటిలోనూ కనబడే దైవస్తుతులు శివుడు, ఉమ, మురుగన్, విష్ణువు, లక్ష్మి, చతుర్ముఖ బ్రహ్మ, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు, ఏకాదశ రుద్రుల గురించి - వీరంతా ఎవరు?Paripadal అయితే మొత్తం శ్రీ మహావిష్ణువును ప్రస్తుతించడం కోసమే రచించినట్లు ఉంటుంది.

          కేవలం వైదిక దేవతలనే కాదు, ఉత్తర భారతంలోని పవిత్ర పదేశాలనీ తమిళ సాహితీవేత్తలు కూడా అంతే గౌరవభావంతో ప్రస్తుతించారు.మధురై నగరానికి ఆ పేరు మధుర మీద ఉన్న మమకారంతోనే పెట్టారు - ఇంకెక్కడా ఈ పేరుతో మూడో నగరం లేదనే చెప్పాలి!ఇక క్రీ.శ 2వ శతాబ్ది తర్వాత తిరువళ్ళువర్ కవి రచించిన తమిళవేదం అని చెబుతున్న కురల్ నిరీశ్వర వాదంతో నిండినదని చాలామంది పొరబడతారు.సుమారు వెయ్యికి పైన ఉన్న తమిళ కవితల్లో మోక్షం గురించి వదిలేసి నీతి(aram), రాజకీయం(polity), ప్రేమ(imbam) అనే మూడింటిని గురించి మాత్రమే చెప్పడం జరిగిందనేది నిజమే!అయితే, సనాతన వైదిక సంప్రదాయం ప్రకారం కూడా ధర్మ, అర్ధ, కామములను సరైన తీరున సాధిస్తే మోక్షం గురించి ఆందోళన పడనక్కరలేదు!

          ఇంకా కురల్ లక్ష్మీదేవిని గురించి ప్రస్తావించి ప్రస్తుతించి ధర్మమార్గం తప్పనివారినే ఆమె కటాక్షిస్తుందని చెబుతుంది - ఇంకెక్కడి నాస్తికత్వం, ఇంకెక్కడి ఆర్యానార్య ద్రవిడ విభిన్నత్వం!ఒక పాండ్యరాజు తాను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల వైపున నిలబడి గజబలాన్ని నడిపించినట్లు చెప్పుకుంటున్న ఒక శిలాశాసనం ఉన్నది.పాండ్య, చోళ, చేర రాజవంశీయులు అందరూ అయితే సూర్యవంశానికీ లేదా చంద్రవంశానికీ సంబంధించినట్టు చెప్పుకున్నారు,వైదిక క్రతువులను చేశారు,వైదిక జీవన విధానాన్ని పాటించారు - వారు ఆనాడు నిర్మించిన ఆలయాలు సైతం వారు వైదిక సంస్కృతిని గౌరవించారనటానికి సాక్షీభూతంగా నేటికీ నిలిచి ఉన్నాయి!తమకు లేని గొప్పను వూహించుకుని వాదిస్తూ అది తప్పనగానే తమిళసంస్కృతిని అవమానించారంటూ రెచ్చిపోవడమే తప్ప తమిళనాట ఆళ్వారులూ నయనారుల ద్వారా పుట్టిన భక్తి ఉద్యమమే క్రస్తవ ఇస్లామీయ మతాల క్రూరమైన దాడికి తట్టుకునేలా హిందూమతాన్ని నిలబెట్టిందనేది జగమెరిగిన సత్యం!ప్రజల మధ్యన ఉన్న అసమానతలని తొలగించి ధనికుల్లో ఔదార్యాన్నీ దరిద్రుల్లో విశ్వాసాన్నీ నింపి వీరందరినీ ఆలయాలకు అనుసంధానించిన భక్తి ఉద్యమాం యొక్క ప్రభావమే క్రైస్తవ,ఇస్లామీయ మతాల దాడులతో నామరూపాలు లేకుండా నశించిపోయిన ఇతర దేశాలలోని స్థానిక సంస్కృతుల మాదిరి నశించిపోనివ్వక సనాతన ధర్మాన్ని ఇప్పటికీ అజేయంగా నిలబెట్టిన గుర్తింపు తమిళులకి ఎప్పటికీ ఉంటుంది!

          సంస్కృతం నుంచి వ్యాకరణం నేర్చుకోవడం అవమానకరం అని ఎందుకు అనుకోవాలి?అసలు ఒక భాషకి వ్యాకరణం ఏర్పరచడం ఆనెది జరగాలంటే అంతకుముందు ఎంతో కొంత భాష ఉంటుంది - దానిని ఏవరూ కాదనడం లేదు,ఆ మూలభాష అసలు పనికిరానిది అని కూడా ఏవరూ అనడం లేదు!ఆ పరిస్థితి తెలుగుకీ ఉంది,కన్నడానికీ ఉంది,సంస్కృత వ్యాకరణం వల్ల కొత్త జవసత్వాలు పొందిన అన్ని భాషలకీ ఉంది.తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) . గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. అయితే ఈయన ధ్యాస,కృషి కేవలం తెలుగు భాషకి మాత్రమే పరిమితం కాలేదు - ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో "రావు బహదూర్‌" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.

          ఈనాడు సవరలు గిడుగు రామ్మూర్తిని తమ మూలసంస్కృతిని ధ్వంసం చేసిన దుర్మార్గుడు అని అంటే ఎట్లా ఉంటుందో తమిళులు వైదికసంస్కృతిని ద్వేషించడం కూడా అట్లాగే ఉంటుంది.నిజానికి తమిళుల్లో పైన చెప్పుకున్న తమిళజాత్యహంకారులు తక్కువే!కానీ అధికారంలో ఉన్నది ద్రవిడ పార్టీలు,గట్టిగా వ్యతిరేకిస్తే జాతిద్రోహి కింద జమకట్టి అల్లరి చేస్తారనే భయం వల్ల బహిరంగ వేదికల మీద ప్రస్తావించలేని ఇబ్బంది చాలామందిలో ఉంది - పిల్లి మెడలో గంటకట్టే ఎలుకవీరుడి కోసం ఎదురు చూస్తున్నారు కాబోలు!ఆ పని చెయ్యగలిగిన బీజేపీ జయలలిత మరణం తర్వాత కల్పించుకుని పాప్యులారిటీ తెచ్చుకోవాల్సిన చోట మూతికాలిన తెనాలి రామలింగడి పిల్లిలా తొట్రుపడి నవ్వులపాలై దురద కొద్దీ వినాయకుడి బొడ్డులో వేలు పెట్టిన కాళిదాసులా అస్సలు వేలు పెట్టగూడని చోట పెట్టి ఇరుక్కుపోయి చావుతిట్లు తింటూ మూలుగుతున్నది.

          ఇప్పుడిప్పుడు బయటపడుతున్న కధనాలు శశికళ జయలలితని తోపులాటలో కిందపడేలా చేసిందనీ ఆస్పత్రికి వచ్చేటప్పటికే జయలలిత అపస్మారకంలోకి వెళ్ళదం గానీ నిర్యాణం చెందడం గానీ జరిగినట్టు అప్పట్లో వచ్చ్గిన వార్తలు నిజమేనని నమ్మేటట్టు ఉన్నాయి.మరి, ప్రధాని నుంచి గవర్నర్ వరకు ఆ నిజాలని యెందుకు బయటికి రానివ్వలేదు?మొదట శశికళని తల నిమిరి బుజ్జగించి తర్వాత పార్టీలో చీలిక తెచ్చి తనని జైలుకి పంపడం కన్న ధీమాగా లోపలికి వెళ్ళి జయలలితని ఆ స్థితికి తీసుకెళ్ళిన నేరం శశికళ మీదకి నెడితే సరిపోయేది గదా!ఈ దేశ ప్రధానీ కేంద్రప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నరూ రాజ్యాంగం వాళ్లకి దఖలు పర్చిన అధికారం ప్రదర్శించితే శశికళా హాస్పటల్ సిబ్బందీ ఎదురు చెప్పే సాహసం చెయ్యగలరా?

          అలా చెయ్యలేనిది ఎందుకంటే,కేవలం 2 సీట్ల నుంచి 200 సీట్లకు ఎదిగి రాజమార్గంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెసు పార్టీ వాళ్లని ముఖం మీదనే "మీ పార్టీ పేరును అఖిల భారత్ భ్రష్తాచారి కాంగ్రెస్ అని మార్చుకోవచ్చు కదా!" అని ఘాటు జోకు వేసి కాంగెసువాళ్ళు కూడా ఏడవలేక నవ్వేటట్టు చేసినప్పటి పవిత్రత ఇప్పుడు ఆ పార్టీలో లేదు. అబద్ధాలు చెప్పడం దగ్గిర్నుంచి స్కాములు చెయ్యడం వరకు అన్నింటిలోనూ కాంగ్రెసును అతివేగంగా దాటేసిన దివాళాకోరుతనం మాత్రమే ఉంది.అప్పటి తమిళ ప్రజల మనస్తత్వంలో ఉద్విగ్నత ఉన్నమాట నిజమే కానీ అప్పటి బీజేపీ నాయకులలో ఉన్న లాలూచీ మనస్తత్వం లేని ఉన్నతుడైన రాజకీయవేత్త అక్కడ ఉండి ఉంటే అతని ప్రవర్తన సూటిగానే ఉండేది!సూటిగా ఉండి అసలు నిజం బయటపెట్టడం వల్ల వీళ్ళకి జరిగే హాని యేమిటో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు!అప్పటికి జయలలిత స్నేహపాత్రంగానే ఉన్నది,శశికళ తన స్నేహితురాలిక్ చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టిన సెంటిమెంటు మోదీకి లాభమే చేస్తుంది గానీ దానివల్ల వీళ్ళకి వస్తుందనుకున్న నష్టం ఏమిటి?జయలలిత వైపునుంచి యేదైనా కిరికిరి ఉంటే వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ బయటపెట్టుకుంటేనే తప్ప తమ ప్రమేయం ఉండదు - ఇంక దేనికి అంత హడావిడి చేశారు అప్పుడు అక్కడ!అక్కడ కల్పించుకోకుండా చీలిక రాజకీయాల్ని ప్రోత్సహించటం వల్లనే తమిళులు బ్యానర్లు కట్టి చావుతిట్లు తిడుతుంటే పడాల్సిన దుస్థితి దాపరించింది.

          ఇప్పటికయినా బీజేపీ 2014లో వేసినవాళ్ళు 2019లోనూ వేస్తారు లెమ్మని మొద్దు నిద్ర పోతూ బంగారు కలలు కనటం ఆపి వాస్తవాన్ని చూడాలి.దక్షిణాది మొత్తం కాలు పెట్టడానికి సందు లేని స్థితిలో ఉంటే కేవలం ఉత్తరాదిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలనుకున్నట్టే ఉంటుంది.ఆంధ్రాకి ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ళ చేతుల్తో వాళ్ళే వాళ్ళ నోట్లో మట్టి కొట్టుకున్నారు,తమిళనాడులో ఇట్లా తమిళుల్ని శత్రువుల్ని చేస్కున్నారు,సిద్ధరామయ్య కెలుకుతున్న లింగాయతుల ఉద్యమం బలపడితే దానిముందు వీళ్ళ తొక్కలో హిందూత్వం నిలబడదు,కేరళలో వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు అంటున్న డిఫెన్సివ్ ఏడుపులే వినపడుతున్నాయి తప్ప బలమయిన వోటుబ్యాంకు ఇంకా ఏర్పడినట్టు లేదు - ఏం చూసుకుని భాజపా వాళ్ళు ఈసారి కూడా కుర్చీ మాదే అని ధీమాగా ఉన్నారో నాకు అర్ధం కావడం లేదు!

          నా లెక్క ప్రకారం దక్షిణాదిలో భాజపా వాళ్ళకి అన్నిటికన్న అనుకూలమైనది ఆంధ్రానే - హోదా/ప్యాకేజీ ఇవ్వకుండా దాన్ని చెడగొట్టుకున్నారు.ఇంక మిగిలిన తురుపుముక్క అయోధ్యలో రామాలయ నిర్మాణం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యోగి చెతిలో ఉంది,ముస్లిములు రాజకీయంగా ఒంటరిగా ఉన్నారు,ముస్లిముల పక్కన నిలబడి హడావిడి చేసే వాళ్ళంతా బలహీనంగా ఉన్నారు -  - నిజాయితీగా ప్రయత్నిస్తే ఎన్నికలకి ముందే ఆలయం కట్టి కాలరెయ్యటానికి అనువైన వాతావరణం ఉంది,అయినా కదలిక లేదు.2 సీట్ల నుంచి 200 సీట్లకి యెదగడానికి కారణం హిందువులకి తమ మీద జరుగుతున ఆధ్యాత్మిక దాడి గురించి నిజాలు చెప్పడమే కారణం అయితే రేపటి ఎన్నికల్లో అత్యంత దయనీయమైన ఓటమికి గురయితే దానికి అబద్ధాలు చెప్పి హిందువులని మోసం చెయ్యడమే కారణం అవుతుంది.


అసతోమా సద్గమయ!తమసోమా జ్యోతిర్గమయ!మృత్యోర్మా అమృతం గమయ!

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...