Wednesday 17 December 2014

ఆనందమఠంలో బంకిం ఋషి చూపిన భారత దర్శనం - నా స్పందనం!

పుచ్చపువ్వులాంటి వెన్నెలలో ఆరాత్రి మహేంద్రుడూ భవానందుడూ అడివిని  దాటుతున్నారు.మహేంద్రుడు శాంతంగా గర్వంతో కొంచెం కుతూహలంగా వున్నాడు.అకస్మాత్తుగా భవానందుడు మరొక విధమైన ఆకృతిని ధరించాడు.సైన్యాధ్యక్షుడి నెత్తిమీద దెబ్బ తీసిన యోధుని అవతారం ఇప్పుడతనిలో కనిపించడం లేదు. వెన్నెల వెలుగులో ప్రశాంత వాతావరణంలో చెట్లతో,కొండలతో,నదులతో,లోయలతో రమణీయమయిన భూసందర్శనంతో మనస్సు పులకించి పోతున్నది.భవానందుదు నవ్వుముఖంతో చక్కగా సంభాషణ గావిస్తున్నాడు,కబుర్ల కోసం యెన్ని వుపాయాలు అన్వేషించినా మహేంద్రుడు సంభాషణకు దిగకుండా మౌనంగానే వున్నాడు.మరో మార్గం లేక భవానందుడిక పాటను అందుకున్నాడు.

"వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం"

     పాట విని మహేంద్రుడు ఆశ్చర్య మొందాడు.అతని కేమీ అర్ధం కాలేదు."తల్లి యెవరు?" అని భవానందుణ్ణి అడిగాడు.భవానందుడు సమాధానం ఇవ్వకుండా పాడుతూనే వున్నాడు.

"శుభ్ర జ్యొత్స్నా పులకిత యామినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం"

     "ఇదైతే దేశం - తల్లి కాదు" అన్నాడు మహేంద్రుడు."మేం మరెవరినీ తల్లిగా గ్రహించం.జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని విన్లేదూ?ఉన్న దేశమే కన్నతల్లి మాకు.తల్లి లేదు,తండ్రి లేడు,అన్నదమ్ములు లేరు,అక్కచెల్లెళ్ళు లేరు - యెవ్వరూ లేరు,ఇల్లు లేదు,వాకిలి లేదు,వున్నదల్లా ఆ సుజల సుఫల మలయజ శీతల సస్యశ్యామల" అని జవాబు చెప్పాడు భవానందుడు.

     మహేంద్రుదు కొంచేం తెల్సుకున్నాడు - "మళ్ళా పాడండి" అని అడిగాడు.భవానందుడు తొలినుంచీ అందుకుని పాడటం మొదలు పెట్టాడు.

వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం!

శుభ్ర జ్యొత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత దృమదళ శొభిణీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం!

సప్తకోటి కంఠ కలకల నినాద కరాలే
ద్విసప్త కోటి భుజైర్ధ్నత ఖరకరవాలే
అబలా కేతోమా ఏతో బలే!

బహుబల ధారిణీం నమామి తారిణీం
దిపుదళ వారిణీం మాతరం
తుమీ విద్య తుమీ ధర్మ
తుమీ హరి తుమీ మర్మ
త్వంహి ప్రాణాః శరీరే
బాహుతే తుమీ మాం శక్తి
హృదషే తుమీ మాం భక్తి
తో మారయీ ప్రతిమా గడీ గడీ మందిరే!

త్వంహి దుర్గా దశప్రహార ధారిణీ
కమలా కమల ధళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అతులాం అమలాం!

సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం
శ్యామలాం సుస్మితాం సరళాం భూషితాం
ధరణీం తరణీం మాతరం!


     సన్యాసి పాడుతూ యేడ్వటం చూశాడు మహేంద్రుడు.మహేంద్రుడి మనస్సు కూడా అంతులేని భావావేశంతో వూగిపోతున్నది.
                                                                                                     ------------------బంకించంద్ర చటోపాధ్యాయ

యెంతటి సౌందర్యరాశి మన దేశమాత!

          కాశ్మీర దేశమను ముఖబింబము తరళ సౌందర్య సంశోభితమై మెరవగా,పంచాబ్జము హిమాచల ప్రదేశముతో గల్సిపోయి మెదవొంపై కుదరగా,హరియాణమా గళసీమ యందు కాంతులీను పచ్చల పతకమై శోభిల్లగా,హస్తిన హృదయభాగాన సుస్థిరముగ రక్షితమై యుండగా,రాజస్థానపు యెగువ భాగము కుడిభుజము గాను ఉత్తర దేశపు అగ్రస్థానము యెడమ భుజము గాను రూపు దిద్దుకొని కడపటి ఉత్తర దేశము బీహారుతో గల్సి వంగదేశము వరకు సాచిన వామహస్తమై తోచుచుండగా,అస్సాము త్రిపుర మేఘాలయ మణిపుర మిజోరము లన్నియు నేకమై బిగించిన పిడికిలిగా,అరుణాచల ప్రదేశము జయసూచకముగ పైకెత్తిన బొటనవేలుగా,రాజస్థానమును దిగువకు మోచేయిగా మడిచి గుజరాతమను అరచేతిని సుతారముగ మరాఠ దేశమనెడి నితంబసీమపై మోపి యుంచగా,మధ్యప్రదేశము రమణీయంబగు కటిస్థలమై అమరి యుండి భోపాలు నగరము సరిగా నాభిప్రదేశమై నెలకొని యుండగా,వింధ్య సానువులను స్వర్ణమేఖలగ దాల్చి ఓడ్ర దేశ మటువైపు యెడమ వూరువై సౌష్ఠవము గూర్చగా,కుడివైపున దిగువ మరాఠ దేశమను వూరువు నుండి కర్ణాటకము సాగి కేరళ యను పాదాబ్జముపై దృఢముగ నిలువంబడి అటువైపు ఓడ్ర దేశము నుండి కిందకు దిగిన ఆంధ్రదేశ మొయ్యారముగ వొంచిన తన్వి మోకాలి వొంపై అందము నిబ్బడించగా,అందుండి సాగిన సెందమిళనాడను వామపాదంపు మునివేళ్ళను నేలపై నల్లన తాకించి ఒక నిసర్గ సుందరమైన నాట్యభంగిమలో అవతరించిన మాతృభారతికి వందనం!

          అండమాను నికోబారులు ఆమె పాదాల కడ ప్రకృతియే పులకించి సమర్పించిన పుష్పరాశులై వెలుగు అట్టి సహజ సౌందర్య సంశోభితమగు దేశమాతను యే కాలమందు గాని, యెంత కిరాతకులైన గాని వికృత పరచకుంద్రు గాక!తల్లిని దూషిత మొనరించు ఘోరకృత్యములు సలుపకుంద్రు గాక!
హరి.S.బాబు
15.08.1990




2 comments:

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...